–నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : ప్రజా దీవెన, నిజామాబాద్: బీఆర్ ఎస్ పాలనలో నిరుద్యోగులను ము ప్పుతిప్పలు పెట్టారని,పదేళ్ల పాటు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. నేను చెప్పింది నిజ మైతేనే మాకు ఓటు వేయండని కోరారు. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భా గంగా ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఎ మ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రభు త్వానికి, పట్టభద్రులకు మధ్య వార ధిగా ఉంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బలహీన పర్చే కుట్రలు చే స్తున్నారని మండిపడ్డారు. బీఆర్ ఎస్ను ప్రజలు తిరస్కరిస్తే కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకున్నారని బీ ఆర్ఎస్ నాయకులు ఏ అభ్యర్థికి ఓటు వేయాలని చెబుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ను గెలిపించవద్దని ప్రచారం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో పోటీకి నిలబడని బీఆర్ఎస్ రాజకీయ పార్టీఏ కాదన్నారు. పోటీ కి నిలబడని వారు కాంగ్రెస్ను ఎలా ప్రశ్నిస్తారని నిలదీశారు. తమకు పరిపాలించే అవకాశం తక్కువగా వచ్చిందని అయినా 55,163 ప్రభు త్వ ఉద్యోగాలు భర్తీ చేశామని చె ప్పుకొచ్చారు.స్కిల్స్ యూనివర్సి టీ ఏర్పాటు చేస్తున్నామని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిజామాబాద్కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్కు గ్రూప్ వన్ పోస్టు ఇచ్చామన్నారు. వరంగల్కు చెందిన దీప్తికి గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. నిజా మాబాద్ రైతులు పంజాబ్ రైతుల తో పోటీపడి పంటలు పండిస్తార న్నారు. రైతు రుణమాఫీ చేశామని రైతు భరోసా ఇచ్చామని తెలిపా రు. కేసీఆర్ సర్కారు చేసిన అప్పు కు ఇంత వరకు 75 వేల కోట్ల వడ్డీ కట్టామన్నారు. తాను సీఎం అ య్యాక ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెల ఒకటో తేదీన జీతం ఇస్తున్నా మన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల బెని ఫిట్స్ 8 వేల కోట్లు బకాయి పెట్టార ని, రాబోయే రోజుల్లో నెలకు వె య్యి కోట్ల చొప్పున చెల్లిస్తామని ప్రకటించారు.బండి సంజయ్ బడా బీసీ అంటున్నాడని, మీరు పదేళ్ళ లో కులగణన ఎందుకు చేయలే దని ప్రశ్నించారు. మీకోసం లెక్కలు తేల్చి నేను కొట్లాడుతున్నా, బల హీన వర్గాల లెక్కలు తప్పైతే ఆధా రాలతో చూపించండి, సొల్లు మాట లు వద్దన్నారు. గుజరాత్లో 29 కులాల ముస్లింలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. మాదిగ ఉప కులాల వర్గీకరణ చేసి చట్టసభల్లో ఆమోదించాంమని, మోదీ, కృష్ణ మాదిగను కౌగిలించుకున్నాడు కానీ వర్గీకరణ చేయలేదన్నారు.
జర్నలిస్టుల సమస్యలు పట్టించు కుని పరిష్కరిస్తున్నామని తెలి పారు. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు అరెస్ట్ కాకుండా అడ్డుకుంటుంది బండి సంజయ్, కిషన్ రెడ్డి కాదా అన్నారు. ఈ కార్ రేసులో కేటీఆ ర్ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేయ లేదన్నారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును ఎప్పుడు విదేశాల నుంచి రప్పిస్తారు. బండి సంజయ్ శాఖ పనే కదా వారు రాగానే బొక్కలో వేస్తామన్నారు. వారితో చీకటి ఒ ప్పందాలు చేసుకుని కాపాడుతు న్నారని, కాగితాలు ఇచ్చి డ్రామా లు చేస్తున్నారన్నారు. ఉన్న ఎన్ని కల్లో అభ్యర్థిని పెట్టలేని బోడి పార్టీ ఉప ఎన్నికల్లో తడాఖా చూపిస్తా రట, హైదరాబాద్ మెట్రోకు అను మతి రాకుండా కేంద్రంలో కిషన్ రెడ్డి ఒత్తిడి తెచ్చారని ఆరోపించా రు. మూసీ ప్రక్షాళనకు నిధులు రా కుండా అడ్డుకున్నారని, మాకు క్రెడి ట్ వస్తదని తెలంగాణ అభివృ ద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పారు. పట్ట భద్రులు అండగా నిలబడండి కేం ద్రంతో కొట్లాడి నిధులు తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మ హేష్ కుమార్ మాట్లాడుతూ దూర దృష్టి ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి అని, రేవంత్ ధైర్యంతో రాష్ట్రా న్ని ముందుకు నడిపిస్తు న్నారన్నా రు. 9 మాసాల్లో 56 వేల ఉద్యోగా లు ఇచ్చారని చెప్పారు. భగవం తు డు అందరికీ ఉన్నారన్నారు. బీజేపీ కేంద్ర మంత్రులు కేంద్ర బడ్జెట్లో రా ష్ట్రానికి తెచ్చింది సున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. పట్టభద్రులు ఆలోచిం చి ఓట్లు వేయాలని మహేష్ కుమా ర్ కోరారు.