JEE Main 2025 : ప్రజా దీవెన, హైదరాబాద్: సంయు క్త ప్రవేశ పరీక్ష (JEE) మెయిన్ 20 25 సెషన్ 2 ఆన్లైన్ దరఖాస్తుల గడువు మంగళవారంతో ముగియ నుంది. ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభ మైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 25 తో ముగుస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు చి వరి అవకాశాన్ని వినియోగిం చుకో వాలని అధికారులు సూచిస్తు న్నా రు. యేటా రెండు సార్లు జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం విధితమే. ఈ ఏడాదికి తొలి విడత జేఈఈ మెయిన్ పరీక్ష లు జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్ 1 పరీక్షలు, జనవరి 30న పేపర్ 2 పరీక్ష జరిగాయి. ఇక తుది విడత రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 25వ తేదీ రాత్రి 9 గంటలతో ము గుస్తుంది. తొలి సెషన్లో సాధించి న పర్సంటైల్తో సంతృప్తి చెందని విద్యార్థులు మరింత మెరుగైన స్కోరు కోసం సెషన్ 2 పరీక్ష రాయ వచ్చు. ఫిబ్రవరి 25లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈ ఈ మెయిన్ రెండో సెషన్ పరీక్ష ఏప్రి ల్ 1 నుంచి 8 మధ్య తేదీల్లో నిర్వ హించనున్నారు. దరఖాస్తుల్లో సవ రణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిచేసుకో వచ్చు.
దరఖాస్తు సవరణకు నవం బర్ 28న రాత్రి 11.50 గంటల వర కు అవకాశం కల్పించారు. అయితే దరఖాస్తుల్లో సవరణలు చేసుకుం నేందుకు అదనపు ఫీజును చెల్లిం చాలి. జేఈఈ మెయిన్ సెషన్-2 దరఖాస్తు సమయంలో వివరాలు తప్పుగా నమోదుచేసిన అభ్యర్థు లు ఈ అవకాశాన్ని సద్వినియో గించుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ మా ర్పులకు అవకాశం ఇవ్వరు. ఒక్క సారి మాత్రమే వివరాలు సవరించు కునేందుకు అవకాశం ఇస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా వివరాలను సవ రించుకోవాలని ఎన్టీఏ అధికారులు సూచిస్తున్నారు.ఆన్లైన్ దరఖాస్తు లో అభ్యర్థి మొబైల్ నంబర్, ఈ- మెయిల్, అడ్రస్, ఎమర్జెన్సీ కాంటా క్టు వివరాలు, అభ్యర్థి ఫొటోను మా త్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చడా నికి అవకాశం ఉండదు. మిగిలిన వివరాలు ఇలా ఉన్నాయి. అభ్యర్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేర్లలో ఏదో ఒకటి మాత్రమే సవరించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పదో తరగతి, 12వ తరగతి సంబంధిత వివరాలు, పాన్ కార్డు నంబర్, పరీ క్ష రాయాలనుకొనే నగరం, మాధ్య మాన్ని మార్చుకొనేందుకు ఛాన్స్ ఉంటుంది. అభ్యర్థి పుట్టిన తేదీ, జెండర్, కేటగిరీ, సంతకం కూడా మార్చుకొనేందుకు అవకాశం ఇస్తా రు. ఇక జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు ముగిశాఖ మే 18న జేఈ ఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఉంటుంది. జేఈఈ మెయిన్ ర్యాంకులతో ఎన్ ఐటీలు, అడ్వాన్స్డ్ ర్యాంకులతో ఐఐటీల్లో సీట్లు కొట్టేయొచ్చు.