Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Earthquake : ఇండోనేషియాలో భారీ భూకంపం, సులవెసి ద్వీపంలో 6.1 తీవ్రత నమోదు

Earthquake : ప్రజా దీవెన ఇండోనేసియా: ఇండో నేషియాలో భారీ భూకంపం సంభ వించింది. ఆ దేశంలోని సులవెసి ద్వీపంలో 6.1 తీవ్రత నమోదు అ య్యింది. భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంపo కేంద్రీకృతమైం ది. 2004లో సంభవించిన భూకం పం, సునామీ కారణంగా 1.7 లక్షల మంది మృతి చెందిన విషయం విధితమే. ఇండోనేషియాను మరో మారు భారీ భూకంపం కుదిపేసిం ది. సులవెసి ద్వీపంలో ఈ ఉద యం 6.55 గంటలకు 6.1 తీవ్రత తో భూకంపం సంభవించింది. ఉత్త ర సులవెసి ప్రావిన్స్ సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే దీనివల్ల సునామీ ప్రమా దం లేదని అధికారులు ప్రకటించ డంతో ప్రజలు ఊపిరి పీల్చుకు న్నారు. అంతేకాదు, భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని వార్తలొ స్తున్నాయి.

పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉన్న ఇండోనేషియాను తరచూ భూకంపాలు భయపెడు తునే వున్నాయి. సులవెసి ద్వీపం లో గతంలో భయంకరమైన భూకం పాలు వచ్చాయి. 2021, జనవరి లో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 100 మందికి పైగా మరణించగా, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. 2018లో పలులో 7.5 తీవ్రతతో భారీ భూ కంపం, సునామీ సంభవించడంతో 2,200 మందికి పైగా మృతి చెందా రు. ఇక, 2004లో 9.1 తీవ్రతతో సంభవించిన అత్యంత భయం కరమైన భూకంపం, ఆ వెంటనే సునామీ పోటెత్తడంతో 1.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.