Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్:తెలంగాణ పోలీసు కుటుంబాల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు సంబంధించి వెబ్సైట్ https://yi pschool.in ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో పోలీస్ స్కూల్ వెబ్సైట్తో పాటు సమగ్ర సమాచా రంతో కూడిన బ్రోచర్ను విడుదల చేశారు. 2025-26 విద్యా సంవత్స రం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారం భమవుతున్న నేపథ్యంలో పిల్లలకు స్కూల్ యూనిఫామ్తో పాటు ఇతర అంశాలను ముఖ్యమంత్రి పరిశీలించారు.
సైనిక్ స్కూల్ తర హాలో పోలీస్ స్కూల్ను కూడా దే శానికి ఒక రోల్ మాడల్గా ఉండే లా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.విద్యా విధానంలో కొత్త ఒరవడిని అవలం భించాలని, క్రీడల పట్ల ప్రత్యేక దృ ష్టి సారించాలని చెప్పారు. అడ్మిష న్లలో పోలీసు అమరుల కుటుంబా ల పిల్లలకు మొదటి ప్రాధాన్యతను ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిష నర్ సీవీ ఆనంద్, అదనపు డీజీపీ (ఆపరేషన్స్) స్టీఫెన్ రవీంద్రతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీసు కుటుంబాల పిల్లల కోసం అంతర్జాతీయ స్థాయి స్కూల్ నిర్మాణం కోసం గత ఏడాది అక్టోబర్ 21 న ముఖ్యమంత్రి భూ మి పూజ చేసిన విషయం తెలిసిందే.