Tunnel accident: ప్రజా దీవెన, హైదరాబాద్: నోరుంది కదా అని ఏదిపడితే అది మాట్లాడ రాదు. అయితే తమకు నోరుంది కదా అని కాంగ్రెస్ను తిట్టడమే పని గా పెట్టుకున్న బిఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న తీరు దారుణం కాక మరోటికాదు. నోరు పెద్దది చేయడం ద్వారా పదే ళ్ల పాపాలను కప్పిపుచ్చుకోవాలని చూస్తోంది. తప్పుచేసిన వాళ్లే గట్టి గా అరిచేస్తారు. ఇంతకాలం తమదే అధికారం అనుకున్నారు. జీవితాం తం తామే అధికారంలో ఉంటామ ని అనుకున్నారు. తండ్రి తరవాత తనయుడే సిఎం అవుతాడని భా వించారు. గడీల రాజ్యం నెలకొల్పి దానిని కొనసాగిద్దామనుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల దెబ్బ తో ఓటమిని తట్టుకోలేక పోతున్నారు. అందుకే ఏదిపడితే అది మాట్లాడు తున్నారు. తెలంగాణను అప్పుల కుప్ప చేసి, దోపిడీకి తెరలేపి, సర్వ నాశనం చేసిన వారే ఇవాళ నోరు పెద్దది చేస్తున్నారు. అప్పులపై ప్రశ్న లకు సమాధానం లేదు.
కాళేశ్వరం అవినీతిపైనా సమాధానం లేదు. ధరణి అక్రమాలపై నోరు మెదపరు. ప్రభుత్వ భూముల మాయంపైనా జవాబు చెప్పారు. నాటి ఎమ్మెల్యే లు, మంత్రుల భూ దందాలపైనా నోరువిప్పరు. ఎమ్మెల్యేలను అప్ప నంగా పార్టీలో చేర్చుకున్న వారు ఇప్పుడు జరిగింది మాత్రం తప్పం టారు. ఎల్స్బిసి సొరంగంలో ప్రమా దం జరిగి 8మంది కూరుకుపోతే ప్రభుత్వానిది తప్పట. ఇంతకన్నా దారుణమైన విమర్శ మరోటి ఉం డదు. అలా అయితే కొండట్టు ప్ర మాదానికి, మాసాయిపేట స్కూలు బస్సు ప్రమాదానికి కెటిఆర్, హరీష్ రావులు బాధ్యత వహించాలి. ఇదంతా ఎందుకంటే ఎక్కడ తమ పునాదులు కదులుతాయోనన్న భయం వారిని వెన్నాడుతోంది. అం దుకే ప్రతి చిన్నాచితకా విషయా లపై ఎదురుదాడి దిగుతున్నారు. అక్రమాలపై నిలదీస్తుంటే వాటికి సమాధానాలు పక్కన పెట్టి జీతా లు ఇవ్వడం లేదంటారు. సకాలం లో నీళ్లు రావడం లేదంటారు.
అ ప్పుడే కరెంట్ పోయిందని అం టారు. ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారని అంటారు. అం దుకే ఓ క్రమపద్దతిలో గత ఏడా దిగా ఎదురుదాడితో బిఆర్ఎస్ ముఖ్యులు ముందుకు సాగుతు న్నారు. లోక్సభ ఎన్నికలు ముందు ఇలాగే అరచి గీపెట్టినా ప్రజలు ఒ క్కటంటే ఒక్కసీటు గెలిపించలేదు. అందుకే ఎమ్మెల్యేను కొనుగోలు చేసారని గీపెడుతున్నారు. సుప్రీం కోª`టులో దావా వేశారు. ఉప ఎ న్నికలు తప్పవని ఊదరగొడు తున్నారు. తెలంగాణలో బిఆర్ఎస్ ఉనికి కోల్పోవడం ఖాయమని ప్ర చారం సాగుతోంది. కాంగ్రెస్, బిజెపి లకన్నా ఆ పార్టీ ఎక్కువగా ఒత్తిడికి గురవుతోంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మూడు నెలల్లో మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కోవా ల్సి రావడం..అవినీతి, అక్రామల పాపాలు వెన్నాడడంతో పాటు, ప్రజల్లో ప్రాభవం కోల్పోవడంతో తట్టుకోలేకపోతున్నారు. అధికారం లో ఉండగా ప్రజలను ఎందుకు కలవాలన్న వారే ఇప్పుడు నా ప్రజలు అంటూ బయలుదేరారు. ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. మరో వైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా లేని పార్టీ నేతలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకు నేందుకు నానా తంటాలు పడుతు న్నారు. కాంగ్రెస్ చేసే తప్పులను ఓ రకంగా వీరుకప్పిపుచ్చుతున్నారనే చెప్పాలి.
ఈ సమయంలో బలంగా ప్రజల్లోకి వెళ్లడానికి ఓ అజెండా కూడా కరవైంది. దీనికితోడు కాళే శ్వరం పాపాలను నిత్యం ప్రశ్నిస్తు న్నారు. మేకపోతు గాంభీర్యం ప్రద ర్శించకుంటే బాగుండదని అనుకు న్నారో ఏమో ఏదిపడితే అదే విమ ర్శిస్తున్నారు. కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టవచ్చన్న భావన కావచ్చు. తెలంగాణ ఉద్యమంలో కీలకమైన నీళ్ల అజెండాతోనే మళ్లీ వెళ్లాలని.. కాళేశ్వరం విషయంలో తాము చేసి న కృషిని తక్కువ చేస్తున్న ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించడం కూడా కావచ్చు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ ఉద్యమం నాటి నినాదం మరోమారు తెరపైకి వ చ్చింది. ఉద్యమ కాలం నాటి నీళ్లు, నిధులు, నియామకాలు నినాదం ఇప్పుడు మార్మోగిస్తున్నారు. పదే ళ్లతో దానికి పాతర వేసిందే బిఆర్ ఎస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై దశాబ్దం కావొస్తున్నా ఉద్యమ కా లం నాటి నీళ్లు, నిధులు, నియామ కాలు సాకారం కాలేదన్నది జగమె రిగిన సత్యం. ఎందుకంటే కెసిఆర్ పాలనలో కాళేశ్వరం కట్టి కల్లబొల్ల ఇకబుర్లు చెప్పారు. తెలంగాణ ప్ర జలు అంతా ధనవంతుల య్యా రని, ఎకరా భూమి ఎక్కడా 30 లక్షలకు తక్కువ లేదని నమ్మ బలికారు. ఇలా ఉద్యమ ఆకాంక్ష లను నెరవేర్చామని పదేళ్లుగా ప్రచారంలో ప్రజలను ముంచారు.
కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై కాంగ్రె స్ బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడంతో పదేళ్ల అధి కార మత్తులో ఉన్నవారి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. గతంలో అధి కారంలో ఉండగా మేడిగడ్డకు ఒక్క రిని కూడా పోకుండా పోలీసులను కాపలా పెట్టింది. కాళేశ్వరం ప్రాజె క్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ ఎన్నికలకు ముందు కుంగిపోయిన విషయం వెలుగు చూసింది. అప్ప టినుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారిం ది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అధి కారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీ ఆర్ఎస్ వైఖరిని ఎండగట్టేందుకు అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేసింది. ’కాళేశ్వరం ఓ విఫల ప్రాజెక్టుగా ఎ త్తిచూపింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తెలం గాణ ప్రజానీకానికి తెలియచే సింది. మొత్తంగా అనేక విషయాల్లో బిఆర్ఎస్ ఎదురుదాడికి గురవు తోంది. పాపాలు బద్దలవుతు న్నా యి. అందుకే నిజాలు మరచి సొ రంగ ప్రమాదంపై ఇష్టం వచ్చినట్లు గా విమర్శలుచేస్తూ అభాసుపా లయ్యారు. స్థానిక ఎన్నికల్లో బిఆ ర్ఎస్ను ప్రజలు ఆదరిస్తే ఉంటా రు.. లేకుంటా కాలగర్భంలో కలసి పోతారు. రాజకీయ అవినీతికి పాల్పడే పార్టీలను ప్రజలు ఎప్ప టికప్పుడు గుర్తించి తగిన శాస్తి చేస్తేనే రాజకీయాలు మలినం కావు.