Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mandakrishna Madiga: రిజర్వేషన్‌ ఎక్కువగా మాలలే అనుభవించారు

— ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ

Mandakrishna Madiga: ప్రజా దీవెన, హైదరాబాద్‌: ఇప్పటి వరకు జనాభా ప్రతిపాదన కాకుం డా ఎస్సీలో మాలలే ఎక్కువ రిజ ర్వేషన్‌ ఫలాలు అనుభవించారని ఎమ్మార్పీఎస్‌ అధినేత, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఎస్సీ రిజర్వేషన్ల సమాన కంపెనీ కోసం తాము వర్గీకరణ ఉద్యమం చేపడితే మాలలు అడ్డుకున్నారని విమర్శించారు. జస్టిస్‌ షమీ అక్తర్‌ నివేదిక శాస్త్రీయంగా లేదని గ్రూపుల్లో కులాల చేర్పు సరిగ్గా లేదని, దీనిని సవరించాలన్నారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ ఎస్సీలలోని నేతకాని, మహార్‌, ఓలియ దాసరి, మాల దాసరి, మిత్‌ అయ్యల్‌వార్‌, డోర్‌, మంగ్‌, మాంగ్‌ గరోడి తదితర కులా లను ప్రత్యేక గ్రూపులో కాకుండా గ్రూపు-3లో చేర్చారని, మాలల ఒత్తిడి వల్లనే ఇది జరిగిందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణలో అన్ని కులాలకు న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమన్నారు. ఎస్సీలలోని అన్ని కులాలకు తహసీల్దార్‌ ద్వారా కుల ధ్రువీకరణ పత్రా లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎంపీ వెంకటేష్‌ మెహతా మాట్లాడుతూ నేతకాని కులస్థులను ప్రత్యేక గ్రూపులో చేర్చాలని, మాలలతో కలిసి ఉండమని అన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాలకు చెందిన నేతలు బి.దీపక్‌కుమార్‌, పృథ్వీరాజ్‌యాదవ్‌, దుర్గం రాజేష్‌, రాంబాబు, బాలాజీ, చంద్రశేఖర్‌, సోమయ్య, కిష్టయ్య, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.