–కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ :మే 4న నిర్వహించనున్న నీట్ ప్రవేశ పరీక్షకు ప్రభుత్వ సంస్థల్లోనే పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారుల ఆదేశించారు. ఇందుకుగాను నల్గొండ పట్టణంలో ఆయా ప్రభుత్వ ఆ కళాశాలలు, పాఠశాలలను పరిశీలించాల్సిందిగా ఆమె ఆదేశించారు. నీట్ ప్రవేశ పరీక్ష కేంద్రాల ఏర్పాటు విషయమై బుధవారం ఆమె తన చాంబర్లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, సంబంధిత జిల్లా శాఖల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం ప్రభుత్వ సంస్థల్లోనే నీట్ ప్రవేశ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉందని అన్నారు. కాగా నల్గొండ జిల్లా నుండి సుమారు 2800 వరకు అభ్యర్థులు నీట్ పరీక్షలు రాసే అవకాశం ఉంది. ఇందుకు అవసరమయ్యే పరీక్ష కేంద్రాలను గుర్తించి ఆ కేంద్రాలలో అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా చూడాల్సిందిగా జిల్లా కలెక్టర్ చెప్పారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా ఇన్చార్జి రెవెన్యూ అధికారి వై.అశోక్ రెడ్డి, నీట్ ప్రవేశ పరీక్ష నోడల్ అధికారి, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దశ్రు నాయక్, డీఈఓ బిక్షపతి, డిఎస్పి రమేష్, ఇతర అధికారులు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.