Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

NDMA : ఆపద మిత్ర వాలంటీర్ల శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించిన జాతీయ విపత్తు నిర్వహణా అథారిటీ

NDMA : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ :  జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) మరియు రాష్ట్ర విపత్తు నిర్వహణా అథారిటీ (SDMA) ఆద్వర్యములో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయము, నల్లగొండ లో ఆపదమిత్ర వాలంటీర్ల 2వ బ్యాచ్ శిక్షణా కార్యక్రమము 24-02-2025 నుండి 07-03-2025 వరకు నిర్వహించబడుచున్నది. ఇట్టి శిక్షణ కార్యక్రములో (130) మంది మహిళా వాలంటీర్లు శిక్షణ పొందుచున్నారు.

అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపాలు, తుఫానులు మొదలగు విపత్తుల సందర్భములో శిక్షణా వాలంటీర్లు అనుసరించవలసిన టెక్నిక్లు, స్పందించవలసిన తీరు, వినియోగించవలసిన వనరులు మొదలగు అంశములపై క్లాస్ రూమ్ మరియు ప్రాక్టికల్ శిక్షణ యివ్వడం జరుగుచున్నవి.

నల్లగొండ డిఆర్డిఎ లో నిర్వహించబడుచున్న ఇట్టి శిక్షణా కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ అండర్ సెక్రెటరీ ఆర్.కె. మిశ్రా, ఎన్డిఎంఏ , న్యూడిల్లీ, ఎన్డిఎంఏ ప్రాజెక్ట్ స్పెషలిస్టు లికున్ పాత్ర, అపదమిత్ర తెలంగాణ రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ గౌతమ్ క్రిష్ణ తేజ సందర్శించి శిక్షణ నిర్వహించబడుచున్న విధానము, శిక్షకులకు కల్పించబడిన ఆహార మరియు హాస్టల్ వసతి మొదలగు అంశాలను పరిశీలించారు,అనంతరం శిక్షణ పొందుచున్న మహిళా వాలంటీర్లతో మరియు మొదటి బ్యాచ్ వాలంటీర్లతో కలుసుకొని అభిప్రాయాలూ పరుచుకొని శిక్షణా కార్యక్రమముపై సంతృప్తి వ్యక్తం చేసినారు.

శిక్షణలో భాగంగా వాలంటీర్లు అగ్నిమాపక సిబ్బంది అద్వర్యంలో రోప్ రేస్క్యు మరియు ఫైర్ సేఫ్టి డెమోలు భారత ప్రభుత్వ అధికారులు పరిశీలించడం జరిగింది.ఇట్టి కార్యక్రమములో శిక్షణ యివ్వడానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ జి. ప్రసన్న కుమార్, డా” మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, ప్రాంతీయ శిక్షణా సంస్థ మేనేజర్, నల్లగొండ పి.వెంకటేశ్వర్లు, డి ఆర్ డి ఏ, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్, డి.మోహన్ రెడ్డి, నల్లగొండ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణరెడ్డి, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్, పి.ప్రభాకర్ ఇతర సిబ్బంది పాల్గొనడం జరిగింది.