CPMparty : ప్రజాదీవెన , నల్లగొండ : పట్టణ పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి. సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం దొడ్డి కొమరయ్య భవన్లో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ పేదల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రకారం సంవత్సరానికి 12000 ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిందని అన్నారు.
అది నేడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉపాధి హామీ కూలీలకు మాత్రమే ఇస్తామనడం సిగ్గుచేటని, గ్రామీణ ప్రాంతాల్లో భూములు లేక యాంత్రికరణ పెరిగిన తర్వాత వ్యవసాయ పనులు లేక జీవనోపాధి కోసం పట్టణాలకు వలస వచ్చి అద్దె ఇండ్లలో ఉంటూ అడ్డాల మీద కూలీలుగా జీవిస్తున్న పట్టణ పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి సంవత్సరానికి 200 రోజులు పని దినాలు రోజు కూలి ఎనిమిది వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం 6 గ్యారంటీలు అంటూ సంక్షేమ పథకాలను వాగ్దానం చేసి అమలు చేయలేక పోయిందని ఆరోపించారు. మహాలక్ష్మి నెలకు 2500 పెన్షన్ల పెంపు యువ వికా సంలో నిరుద్యోగ భృతి ఏమయ్యాయని ప్రశ్నించారు.సిపిఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ మార్చి బడ్జెట్ సమా వేశాల్లో పట్టణ పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయ డం, ఉపాధి హామీ పథకాన్ని వర్తింప చేయడం కోసం బడ్జెట్లో నిధు లు కేటాయించాలని డిమాండ్ చేశారు. పట్టణ పేదల కు సంక్షేమ పథకాల అమలు కోసం పోరాట కార్యాచరణ ప్రకటించారు.
మార్చి 7న ఆర్డీవో కు వినతి పత్రం, ముఖ్యమంత్రికి లేఖ పై 12 నుండి 15 తేదీలలో సంతకాల సేకరణ, 20న అన్ని రాజకీయ పార్టీ లతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు. మార్చి 24, 25 రిలే దీక్షలు 26 ఆర్డీవో కార్యాలయం ముట్టడి, 28న జరుగు జిల్లా కలెక్టరేట్ మహాధర్నా లో పట్టణ పేదలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం పట్టణ పేదల సంఘం కన్వీనర్ గా దండెంపల్లి సత్తయ్య, మరో 25 మంది కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరి గింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, దండెంపల్లి సరోజ, అద్దంకి నరసింహ, గంజి నాగరాజు, భూ తం అరుణ, లింగమ్మ, డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధన పోరాట కమిటీ కన్వీనర్ అవుట రవీందర్, గౌరీదేవి మధు, శ్రీవాణి లావణ్య సరస్వతి, జయమ్మ లింగమ్మ పద్మ అంజయ్య సిరిశాల గిరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.