*ఈ బడ్జెట్ సమావేశాల్లోనే 26 వేల కనీస వేతన అమలు చేయాలి
Gram Panchayat : ప్రజా దీవెన: కనగల్: సిఐటియు కనగల్లు మండల కన్వీనర్ కానుగు లింగస్వామి రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్ లోనే కార్మిక ఖాతాలో వేస్తా అన్న వేతనాలు రెండు నెలలుగా పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని సిఐటియు కనగల్లు మండల కన్వీనర్ కానుగు లింగస్వామి డిమాండ్ చేశారు.శుక్రవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కనగల్లు ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి, అనంతరం సూపర్డెంట్ కు మెమోరండం ఇచ్చారు.. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందర మేం అధికారంలోకి వస్తే కనీస వేతనాలు అమలు చేస్తాం అర్హత కలిగిన వాళ్ళను పర్మినెంట్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అవి అమలు చేయకపోగా నెలలు తరబడి వేతనాలు పెండింగ్ లో ఉంటున్నాయని విమర్శించారు.
పెరిగిన ధరలతో చాలీచాలని వేతనాలతో అవి సకాలంలో రాక గ్రామపంచాయతీ కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా ఇస్తామన్న వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రజాపాలనలో పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ లో గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు నిర్ణయించాలని అర్హత కలిగిన వాళ్లను పర్మినెంట్ చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేసి, పిఎఫ్,ఈఎస్ఐ, ప్రమాద బీమా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి కొంగల నర్సింహ మధు మంజుల కిరణ్ వెంకన్న పాండు బిక్షమయ్య చంద్రకళ నగేష్ రాములు రమేష్ దీనరాని తదితరులు పాల్గొన్నారు