Congress leader Raghupathi Reddy: నాంపల్లి ప్రజా దీవెన మార్చి 8 నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రేపు అనగా ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి సంయుక్తంగా ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు అందుకు కంటి సమస్య ఎదుర్కొంటున్న ప్రజలు హాజరై కంటి పరీక్షలు చేయించుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమానికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్మి హాజరవుతారని అన్నారు.
ఆయన శుక్రవారం రోజున పాఠశాలలో పరీక్ష నిర్వహించు గదులను పరిశీలించారు అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలోపార్టీ కార్యకర్తలకు రేపు జరిగే కంటి పరీక్ష వైద్య శిబిరంలో ప్రతి ఒక్కరు పాల్గొని ప్రజలకు సేవలు అందించాలని వాహనాల పార్కింగ్లో భోజనాల సమయంలో విధులను పాటించాలని ఎవరికీ ఇబ్బంది జరగకుండా చూడాలని కార్యకర్తలను కోరారు ఈ కంటి వైద్య శిబిరం పార్టీ ప్రమేయం లేకుండా నిర్వహిస్తుందని ఇలాంటి సమస్యలు ఉన్న ప్రజలుగ్రామంలో వాలంటీర్ల వద్దపేరు నమోదు చేసుకుని హాజరుకావాలని శిబిరానికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేశామని పరీక్షల అనంతరం కంటి ఆపరేషన్ హైదరాబాదులో నిర్వహిస్తామని అన్నారు.
ఆపరేషన్ చేయించుకుని వారు వెంట ఒక వ్యక్తి ఉండాలని వారికి ఆపరేషన్ సమయంలో తోడు ఉండాల్సి ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు రఘుపతి రెడ్డి పెద్దిరెడ్డి రాజు మండల మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూల యాదగిరి నాంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పానుగంటి వెంకటయ్య గౌడ్ మండల కాంగ్రెస్ నాయకులు కోరే శ్రీనివాస్ కోరే కిషన్ దొ టి పరమేష్ యాదవ్ కామీ శెట్టి యాదయ్య గాదెపాక నాగరాజు కోనేటి గంగోలి తదితరు లు పాల్గొన్నారు