Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CMrevathreddy : మ‌హిళలకు శుభవార్త, సంఘాలకు రైస్ మిల్లులు, గోదాములు

--గురుకులాల‌కు మ‌హిళా సంఘా ల నుంచి పౌష్టికాహారం స‌ర‌ఫ‌రా --కార్పొరేట్ కంపెనీల‌తో పోటీప‌డే లా మ‌హిళా సంఘాల‌ను తీర్చిది ద్దుతాం --సంఘాల బ‌లోపేతంతోనే 1 ట్రిలి య‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థగా తె లంగాణ‌ --ఇందిర‌మ్మ శ‌క్తి, ఎన్టీఆర్ యుక్తిని స్ఫూర్తిగా తీసుకుంటా --పంట ఎండినా, ప్ర‌మాదాలు జ‌రిగి నా పైశాచికానందంలో బీఆర్ఎస్ నేత‌లు --ఇందిరా మ‌హిళా శ‌క్తి స‌భ‌లో ము ఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

మ‌హిళలకు శుభవార్త, సంఘాలకు రైస్ మిల్లులు, గోదాములు

–గురుకులాల‌కు మ‌హిళా సంఘా ల నుంచి పౌష్టికాహారం స‌ర‌ఫ‌రా
–కార్పొరేట్ కంపెనీల‌తో పోటీప‌డే లా మ‌హిళా సంఘాల‌ను తీర్చిది ద్దుతాం
–సంఘాల బ‌లోపేతంతోనే 1 ట్రిలి య‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థగా తె లంగాణ‌
–ఇందిర‌మ్మ శ‌క్తి, ఎన్టీఆర్ యుక్తిని స్ఫూర్తిగా తీసుకుంటా
–పంట ఎండినా, ప్ర‌మాదాలు జ‌రిగి నా పైశాచికానందంలో బీఆర్ఎస్ నేత‌లు
–ఇందిరా మ‌హిళా శ‌క్తి స‌భ‌లో ము ఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

CMrevathreddy:  ప్రజా దీవెన, హైద‌రాబాద్‌: రాబోయే రోజు ల్లో ప్ర‌తి మండ‌ల కేంద్రం లో మ‌హిళా సంఘాల ఆధ్వ‌ర్యం లో రైస్ మిల్లు లు, గోదాములు ఏర్పాటు చేసే బాధ్య‌త‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం, తాను తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపా రు. ఐకేపీ కేంద్రా ల్లో మ‌హిళా సం ఘాల కొనుగోలు చేసే వ‌డ్ల‌ను ఆ గోదాముల్లో నిల్వ చేయ‌డంతో పాటు మిల్లింగ్ చేసి రాష్ట్ర ప్ర‌భు త్వానికి, ఎఫ్‌సీ ఐకి స‌ర‌ఫ‌రా చేసే బాధ్య‌త‌ను మ‌హిళా సంఘాల‌కే అప్ప‌చెబుతా మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

సికిం ద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఇందిరా మ‌హిళా శ‌క్తి ఆధ్వ‌ర్యంలో శ‌నివా రం రాత్రి నిర్వ‌హించిన స‌భ‌లో ము ఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌సంగించా రు. ఐకేపీ కేంద్రాల నుంచి వ‌డ్లు తీససుకుంటున్న కొంద‌ రు మిల్ల‌ర్లు పందికొక్కుల్లా వాటిని కాజేస్తున్నా ర‌ని, వాటిని తిరిగి ఇవ్వ‌డం లేద‌ని, లెక్క‌లు చెప్ప‌డం లేద‌ని సీఎం విమ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి మండ‌లంలో రైస్ మిల్లులు, గోదాముల నిర్మాణం మ‌హిళా సంఘా లు చేప‌ట్టేలా ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తుంద‌ని, ప్ర‌భు త్వ‌మే స్థ‌లం ఇవ్వ‌ డంతో పాటు రైస్ మిల్లులు, గోదాముల నిర్మా ణాల‌కు అవ‌స‌ర‌మైన రుణాలు ఇప్పిస్తుంద‌ని సీఎం తెలిపారు.

మ‌హిళా సంఘాలు త‌మ‌పై కాళ్ల నిల‌బ‌డినప్పుడే తెలంగాణ రాష్ట్రం 1 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక‌ వ్య‌వ‌స్థ‌గా నిలుస్తుంద‌ని సీఎం అ న్నారు. రాష్ట్రంలోని రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ కాలేజీల్లో విద్యార్థుల‌కు పౌష్టికా హారం మ‌హిళా సంఘాల నుంచి స‌ర‌ఫ‌రా చేయాల‌ని నిర్ణ‌ యించా మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి ఒక విధానాన్ని రూపొందించా ల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ ద‌ర్శి , సెర్ప్ సీఈవోను ముఖ్య‌ మంత్రి ఆదేశించారు.

సంఘాల‌కు వెలుగులు… తెలంగాణ‌లో మ‌హిళా సంఘాల‌కు, ఆడ బిడ్డ‌ల‌కు చంద్ర గ్రహ‌ణం తొల‌గింద‌ని, స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌లు మండ‌ల కేంద్రాల‌కు వెళ్లే అవ‌కాశం లేకుండా నాడు చేశా ర‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. ఆడ బిడ్డ‌లు నిర్ణ‌యం తీసుకొని ఇందిర‌ మ్మ రాజ్యం రావాల‌ని ఆశీర్వ‌దిం చ‌డంతో 15 నెల‌ ల కిత్రం ప్ర‌జా ప్ర‌ భుత్వం ఏర్ప‌డింద‌ని సీఎం అన్నారు. ఇప్పుడు ఆడ బిడ్డ‌లు త‌లెత్తు కొని వెలుగు, స్వేచ్చ‌ను చూస్తున్నారన్నారు. ప‌దేళ్ల నాటి పాల‌న‌ను ఏ డాది త‌మ పాల‌న‌ను మ‌హిళ‌లు స్వ‌యంగా చూ స్తున్నార‌ని సీఎం తెలిపారు. మంత్రులు, అధికారుల‌ను స‌మ‌న్వ‌యం చేసి సంఘాల‌ను బ‌లోపేతం చేయాల‌ని తాము నిర్ణ‌యించామ‌ని, సంఘాలు బ‌లోపేత‌ మైన‌ప్పుడే తెలంగాణ 1 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థి క వ్య‌వ‌స్థ‌గా నిలుస్తుంద‌ని ముఖ్య‌మంత్రి ఆశాభావం వ్య‌క్తం చేశారు.

సోలార్ విద్యుత్ ఒప్పందాలు, ఆర్టీసీ బ‌స్సులు.. ఐకేపీ సెంట‌ర్లు నిర్వ‌హించే మ‌హిళ‌ల‌కు గ‌తంలో డ‌బ్బులు ఎప్పుడు ఇస్తారో తెలి య‌ద‌ని, తాము వెంట‌నే చెల్లిస్తు న్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అమ్మ ఆద‌ర్శ పాఠ‌ శాల‌ల నిర్వ‌హ‌ణ‌ను సంఘాల‌కే అప్ప‌ గించామ‌ని, గ‌తంలో జ‌త బ‌ట్ట‌లు కుడితే రూ.25 ఇస్తే తాము దాని ని రూ.75కు పెంచామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. జిల్లా కేంద్రాల్లో ఇందిరా మ‌హి ళా శ‌క్తి సమావేశాలకు భ‌వ‌నాలు ఉం డాల‌ని నిర్ణ‌యించి ప్ర‌తి జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శ‌క్తి సం ఘం భ‌వ‌నానికి అనుమ‌తించి ప్ర‌తి భ‌వ‌నానికి రూ.25 కోట్లు కేటా యించిన విష‌యాన్ని సీఎం గుర్తు చేశారు.

అదానీ, అంబానీలు మాత్ర‌ మే నిర్వ‌హించే సోలార్ విద్యుత్ ప్లాంట్ల‌ ను మ‌హిళా సంఘాల చెంత‌ కు చేర్చామ‌ని సీఎం అన్నారు. మ‌ హిళా సంఘాలు 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు నిర్వ‌హించి వి ద్యుత్ శాఖ‌కు అమ్మేలా చేశామ‌న్నారు. సోలార్ విద్యుత్ ఒప్పందాలు చేసు కున్నామంటే అందుకు త‌మ‌కు ఆడ బిడ్డ‌ల‌పై త‌మ‌కు ఉన్న న‌మ్మ‌క‌ మే కార‌ణ‌మ‌న్నారు. కేసీఆర్ బంధువులు, పెట్టుబ‌డిదారుల‌కే ప‌రి మిత‌మైన ఆర్టీసీ బ‌స్సుల లీజుల‌ను మా బంధువులుగా భావిం చే సంఘాల్లోని మ‌హిళ‌ల‌కు తాము అప్పగించామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

మ‌హిళా సంఘాలు ఆర్టీసీకి 1000 బ‌స్సు లు లీజుకు ఇస్తున్నాయ‌ ని, ఇవ్వాళే 150 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు ఆర్టీసీకి సంఘాలు అంద‌జేశా య‌ని సీఎం వెల్ల‌డించారు. అంత‌ర్జాతీయ మా ర్కెట్‌తో మ‌హిళా సం ఘాలు పోటీ ప‌డేలా హైటెక్ సిటీ ప‌క్క‌న ఇన్పోసి స్, విప్రో వంటి ప్ర‌ముఖ సంస్థ‌ల ప‌క్క‌న మ‌హిళా సంఘాల‌కు 150 షాపులు కేటా యించిన విష‌యాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అ క్క‌డ సంఘాలు త‌మ ఉత్ప‌త్తుల‌ను విక్ర‌యిస్తూ కార్పొరేట్ సంస్థ‌ల‌తో పోటీప‌డాల‌ని, తాము అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని ముఖ్య‌ మంత్రి అభ‌య‌మిచ్చారు.

రానున్న రోజుల్లో మ‌హిళా సంఘా లు ఉత్ప‌త్తుల‌కు ప‌న్నుల మిన‌ హాయింపుతో పాటు ముడి స‌ర‌కు కొనుగోలుకు అవ‌స‌ర‌మైన రుణా లు ఇప్పిస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కేసీ ఆర్ తొలి అయిదేళ్లు త‌న మంత్రి వ‌ర్గంలో మ‌హిళ‌ల‌ను తీసుకోలేద‌ ని, ఈ రోజు మంత్రులుగా ఉన్న కొండా సురేఖ‌, సీత‌క్క మ‌హిళ‌ల త‌ర‌ఫున నిల‌బడి కొట్లాడుతున్నా ర‌ని, మ‌హిళాల ప‌క్షాన మాట్లాడు తున్నార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

రేవంత‌న్న‌గా బాధ్య‌త తీసు కుంటున్న‌…. మ‌హిళ‌లు ప‌రిపా ల‌న‌ లో భాగ‌స్వాముల కావాల‌ని రాజీవ్ గాంధీ స్థానిక సంస్థ‌ల్లో రిజ‌ ర్వేష‌ న్లు తీసుకువ‌చ్చార‌ని, మ‌హిళ‌ లు ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఎద‌గాల‌ని సోనియా గాంధీ మ‌హిళా రిజ‌ర్వే ష‌న్ల‌కు ఆమోదం తెలిపార‌ని ము ఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడా రు. సంఘాల్లోని మ‌హిళ‌లు నా య‌ క‌త్వ ల‌క్ష‌ణాలు పెంపొందించు కుం టే వారికి సీట్లు ఇచ్చి గెలి పించుకు నే బాధ్య‌త తాను తీసుకుంటాన‌ని సీఎం రేవంత్ రెడ్డి హా మీ ఇచ్చారు.

ఆడ బిడ్డ‌ల సంక్షేమ‌మే ఎజెండాగా మొద‌టి సంవ‌త్స‌ రంలోనేరూ.21 వేల కోట్ల జీరో వ‌డ్డీ రుణాలు ఇచ్చి మ‌హిళ‌లు త‌లె త్తుకునేలా చేశా మ‌ని సీఎం తెలిపారు. ప్ర‌స్తుతం మ‌హిళా సంఘాల్లో 65 ల‌క్ష‌ల మం ది స‌భ్యులుగా ఉన్నార‌ని, వారి సంఖ్య‌ ను కోటికి పెంచేందుకు వీలు గా సంఘాల్లో చేరే మ‌హిళ‌ల వ‌య‌స్సు ను 18 నుంచి 15 ఏళ్ల‌కు త‌గ్గిం చ‌డంతో పాటు 60 ఏళ్ల‌కుపైన ఉన్న‌ వారిని తీసుకుంటామ‌ని సీఎం వెల్ల‌ డించారు. కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేయ‌ డ‌మే ల‌క్ష్యం గా ముందుకు సాగుతామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

మొ ద‌టి త‌రం ఇందిర‌మ్మను అమ్మ అని పిలి చార‌ని, రెండో త‌రం ఎన్టీఆ ర్‌ను అన్నను చేశార‌ని, ఇప్పుడు రేవంత‌ న్న‌గా మీరంతా త‌న‌ ను పిలుస్తున్నార‌ని సీఎం అన్నారు. త‌న‌ను కుటుంబ స‌భ్యునిగా భావిస్తున్నార‌ని, అన్న అంటే ఆ కుటుంబాల బాధ్య‌త‌ను తీసుకోవ‌డ‌ మేన‌ని సీఎం భావోద్వేగంతో అన్నారు. ఇది పేగు బంధానికి అతీత‌ మైం ద‌ని, ఆడ బిడ్డ‌ల ఆశీర్వాదంతోనే తాను ఈ రోజు మీ ముందు నిల‌బ‌ డ‌గ‌లిగాన‌ని, ఈరోజు తాను తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మం త్రి గా నిల‌ బ‌డి మాట్లాడుతున్నాన్నంటే అందుకు ఆడ‌బిడ్డ‌ల ఆశీర్వాద‌ మే కార‌ణ‌మ‌ని సీఎం అన్నారు. ఇందిర‌మ్మ శ‌క్తి… ఎన్టీఆర్ యుక్తిని స్ఫూర్తిగా తీసుకొని కోటి మందిని అభివృద్ధిని ప‌థంలోకి తీసుకెళ‌తా నని సీఎం తెలిపారు.

పైశాచిక ఆనందం ఎందుకు…ఎస్సెల్బీసీ ట‌న్నెల్ కూలినా, రోడ్డుపై ప్ర‌మాదం జ‌రిగి మ‌నుషులు చనిపో యినా.. ఎండ‌ల‌తో పంట‌లు ఎండి నా బీఆర్ఎస్ నాయ‌కులు పైశాచిక ఆనందం పొందుతు న్నా ర‌ని. సంబురాలు చేసుకుంటున్నార‌ని ముఖ్య‌ మంత్రి రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. ప‌దేళ్లు అధికారంలో ఉన్న వారికి పది నెల‌ల పాల‌ న‌పై ఏడుపు ఎందుక‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు. ప‌దేళ్లు పాల‌న‌ లో ఉన్న వారు త‌మ అనుభ‌వాన్ని ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రి ష్కారానికి ఉప‌యోగించాల‌ని, సూ చ‌న‌లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.

పైశాచిక ఆనందం ఉన్నోళ్లు బాగుప‌డిన చ‌రిత్ర ఎక్క‌డా లేద‌ని, ఏడు పులు ఆపి అభివృద్ధిలో భాగ‌స్వాములు కావా ల‌ని ముఖ్య‌మంత్రి పి లుపునిచ్చారు. కుల గ‌ణ‌న‌లో పాల్గొనాల‌ని సూ చించారు. కోటి మం ది ఆడ బిడ్డ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేసే దాకా త‌మ‌ ప్ర‌భుత్వం విశ్ర‌ మించ‌దని సీ ఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. స‌భ అనంత‌రం రూ. 22, 793 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కును, బీమా, ప్రమాద బీమా పథకాలకు సంబం ధించిన‌ రూ.44.80 కోట్ల చెక్కును ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మ‌హి ళా సంఘాల‌కు అంద‌జేశారు.

పాట‌ల ర‌చయిత చ‌ర‌ణ్ కౌశిక్‌, గాయ‌ని మ‌ధుప్రియ త‌దిత‌రుల‌ను ముఖ్య‌మంత్రి స‌త్క‌రించారు. మహిళా స్వయం సహాయక సం ఘా ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయ నున్న సోలార్ ప్లాంట్స్ కు వర్చువల్ గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శం కుస్థాప‌న చేశారు. ఇందిరా మహి ళాశక్తి మిషన్-2025 పాలసీని ఆవి ష్కరించారు. ఇందిరా మ‌హిళా శ‌క్తి స‌భ‌కు ముందు ముఖ్య‌మంత్రి రే వంత్ రెడ్డి వివిధ మ‌హిళా సం ఘా ల ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల‌ను ప‌రిశీలించారు.

ఆయా సం ఘాల ఆధ్వ‌ర్యంలో ఉత్ప‌త్తి చేస్తు న్న వ‌స్తువులు, వాటి మార్కె టింగ్ వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఉద్య‌ మ‌కారి ణి, మ‌హిళా జ‌ర్న‌లిస్ట్ జ‌ల‌జ, తెలంగా ణ సాంస్క‌తిక సార‌థి వెన్నెల రచిం చిన పాట‌ల‌ను ముఖ్య‌మంత్రి రేవం త్ రెడ్డి ఆవిష్క‌ రించారు. స‌భ‌లో ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌ మార్క‌, మం త్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, పొ న్నం ప్ర‌భాక‌ర్‌, శ్రీ‌ధ‌ర్ బాబు, సీత‌ క్క‌, కొండా సురేఖ‌, జూప‌ల్లి కృష్ణా రావు, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొ న్నారు.