Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRSHarishRao : హరీష్ ఘాటు వ్యాఖ్య, అబద్దాలకు అంగీలాగు తొడిగితే అచ్చం రేవంతే 

ప్రజా దీవెన, హైదరాబాద్

BRSHarishRao : ప్రజా దీవెన, హైదరాబాద్ :  అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు పరేడ్ గ్రౌం డ్ సాక్షిగా పచ్చి అబద్దాలు మాట్లా డారని మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీ రు హరీష్ రావు తీవ్రస్థా యిలో మండిపడ్డారు. అబద్దానికి అంగీ లాగు తొడుగుతే ఎట్లుంటది అంటే అచ్చం రేవంత్ రెడ్డి లెక్క ఉం టందని ఎద్దేవా చేశారు. బాధ్య యుతమైన పదవిలో ఉండి జవాబు దారీతనంతో నిజాలు మాట్లాడాలి కానీ మహిళల ముందు అబద్ధా లు ఆడడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ పై అడ్డగో లుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలో ఉండి కూడా అదే మాదిరి అబద్దపు ప్రచారాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు.

తెలంగాణ భవన్ లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశం లో ఆయన వద్దిరాజు రవిచంద్ర, ఎ మ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలతో కలిసి మాట్లాడారు. మీడియా సమావేశం లో ఆయన చేసిన వ్యాఖ్యలు మాటల్లోనే… రూ. 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండానే ఇచ్చి నట్లు మోసం చేసారు. నేను గత అసెంబ్లీలో వేసిన ప్రశ్నకు సీతక్క సమాధానం ఇచ్చిన దాని ప్రకారం, 5 లక్షల వరకు మాత్రమే ఎస్‌హెచ్‌జీ, స్త్రీనిధి రుణం తీసుకుంటే వడ్డీ లేని రుణం అని 2015లో అని కేసీ ఆర్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇదే విషయాన్ని అసెంబ్లీలో చెప్పారు.

అంతకంటే ఎక్కువ తీసుకుంటే 12.5శాతం బ్యాంకులు చార్జ్ చేస్తు న్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెబుతున్నది. ఇచ్చిన అప్పంతా వడ్డీ లేని రుణం అంటున్నరు. 21వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండానే, మొత్తం 21 వేల కోట్లు ఇచ్చినట్లు దగా చేస్తు న్నడు. నిన్న చేసిన ప్రచారం డొల్ల ప్రచారం, గోబెల్స్ ప్రచారం.మూడు, నాలుగు కోట్లకే వడ్డీ లేని రుణాలు.

మిగతా 16వేల కోట్లకు 12శాతం చొప్పున మహిళా సంఘాలు వడ్డీ చెల్లించాల్సింది ఉంటుంది. ఎన్ని కల మానిఫెస్టోలో రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు పెంచుత మన్నరు. 15నెలలు గడుస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 5లక్షల పరిమితి వరకే వడ్డీ లేని రుణాలు (విఎల్ఆర్) ఉన్నవి. జీవో విడుదల చేయాలేదు. కనీసం నిన్న మహిళా దినోత్సవం నాడైనా పది లక్షలకు పెంచుతూ కానుకగా జీవో ఇస్తరు అనుకున్నం.కానీ, అవే అబద్దపు మాటలు, బీఆర్ఎస్ పై నిందలు తప్ప ఇచ్చిందేం లేదు. రాష్ట్రంలోని మహిళలందరిని కాంగ్రెస్ మోసం చేసింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో నయా పైసా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడ్డీ లేని రుణం కింద విడుదల చేయలేదు. మహిళా దినోత్సవం నాడు కూడా నిజం చెప్పవా రేవంత్ రెడ్డి. 21వేలు కోట్లు ఇస్తే గనుక దానికి వడ్డీ 2100 కోట్లు అవుతాయి.మీ అబద్దాలు వినలేక మహిళలు వెళ్లిపోయే ప్రయత్నం చేసారు. మొత్తంగా మీరు చెప్పిన 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అనేది శుద్ద అబద్దం. ఒకవేళ మీరు చెప్పింది అబద్దం కాదు అనుకుంటే మీరు ఇచ్చిన 21 వేల కోట్ల వడ్డీ లే ని రుణాలు, చెల్లించిన వడ్డీపై లెక్క లతో సహా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

స్కూల్ యూనిఫాంలను మహిళా సంఘాలకు ఇచ్చామని డబ్బా కొడుతున్నరు.స్టిచింగ్ చార్జీగా మేము జతకు 50 రూపాయలు ఇచ్చినం. 75 రూపాయలకు పెంచినమని రేవంత్ పచ్చి అబద్దం చెప్పిండు. నిజానికి జతకు ఇచ్చింది 50 రూపాయలే. ఒక్కో విద్యార్థి కి రెండు జతలు ఇస్తరు. అంటే ఈ రెండు జతలకు కలిపి 50 చొప్పున ఒక్కో మహిళకు బాకీ పడ్డది నిజం కాదా అని ప్రశ్నించారు. 75 రూపాయలు ఇచ్చింది నిజం అయితే ఏ ఊళ్లో ఇచ్చినవు చూపించాలని రే వంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. ఆఖరుకు మొబైల్ ఫిష్ వ్యాన్లను కూడా తమ ఘనతగా చెప్పుకుంటున్నరు.

పీఎం మత్స్య సంపద యోజన కింద 60శాతం సబ్సిడీ వస్తే, మిగతా 40శాతం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ రుణం తీసుకుంటారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యుష న్ ఏముంది. మీ ఘనతా చెప్పుకోవ డం సిగ్గనిపించడం లేదా అన్నారు. రేవంత్ ప్రమాద బీమా చెక్కుల పంపిణీ పెద్ద జోక్ గా మారింది.

 

ప్రజా పాలన ఏడాది పూర్తియిన సందర్భంగా నవంబర్ 7, 2024న వరంగల్లో జరిగిన కార్యక్రమంలో 35 కోట్ల రూపాయల చెక్కును మహిళా సంఘానికి అందించిండు.

అది క్లియర్ గాక, 3 నెలల తరువా త ఆ చెక్ లాప్స్ అయ్యింది. దానికి ఇంకో 9 కోట్లు కలిపి, మళ్ళీ నిన్న 44 కోట్ల చెక్కును మహిళా సంఘా లకు ఇచ్చిండు. ఇప్పుడైనా చెక్ పాసైతదా, లేదంటే ఇదే డ్రామా కంటిన్యూ అయ్యి, జూన్ రెండు కు మళ్ళీ ఇదే చెక్కు ఇస్తరా అని అడిగారు.

ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కు డమ్మీ చెక్కు అయ్యింది. ఇంతకంటే దివాలాకోరు రాజకీ యం ఇంకోటి ఉంటదా అన్నారు. సీఎం, భట్టి ఇప్పటికైనా ఆ చె క్కులు పొందిన వారికి డబ్బులు వచ్చేలా చూడండి. భట్టి గారంటే నాకు గౌరవం. రాజకీయాల్లో కొద్దో గొప్పో విలువలు కలిగిన నాయ కుడు అనే పేరుంది.రేవంత్ రెడ్డి దుష్ట సావాసంతో, ఇప్పుడు భట్టి కూడా చెడి పోయిండు. బాడీ షే మింగ్ చేయడం, అబద్దాలు మాట్లా డటంలో రేవంత్ రెడ్డితో పోటీ పడు తున్నడు.నేను మీ లాగా మాట్లా డను. నా ఎత్తు గురించి మాట్లా డటం మీ విజ్నతకే వదిలేస్తున్నా.

నాకు ప్రజలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం. వారి లాగా దిగజారలేను. మహిళలను కోటిశ్వరులను చేస్తా మన్నరు. ముందుగా చెప్పినవి అ మలు చేసి చిత్తశుద్ది నిరూపించు కోండి. ఏప్రిల్ 1, 2024 నుంచి ఇప్పటి వరకు ఉన్న వడ్డీ లేని రు ణం డబ్బులు వెంటనే విడుదల చేయాలి. 21వేల కోట్ల వడ్డీ లేని రుణం అన్నారు. ఎంత రుణం తీ సుకుంటే వడ్డీ లేని రుణం ఇస్తారు జీవో సవరించి విడుదల చేయాలి.

స్టిచ్చింగ్ చార్జీ 75 అన్నరు. తక్షణ మే విడుదల చేయాలి.భట్టి వెనుక ముందు చూసుకోండి. 10వేల కోట్ల వడ్డీ లేని రుణాలు కూడా బీఆర్ ఎస్ హయాంలో ఇవ్వలేదు అని గొంతు చించుకున్నారు.ఒక్క 20 22-23లోనే 13వేల కోట్లు ఇచ్చి నం.మేం అధికారంలోకి వచ్చే నా టికి అప్పటి కాంగ్రెస్ 2, 3 వేల కోట్లు మాత్రమే ఇచ్చింది. బీఆర్ఎస్ ప్ర భుత్వం సెర్ప్, మెప్మా, స్త్రీనిధి ద్వా రా మొత్తం లక్ష కోట్ల కోట్ల రూపా యలు రుణాలు ఇచ్చినం. అడిగే వారుండరు ఏది మాట్లాడితే అది ఉంటదా, నేను చెప్పిందే తప్పయితే అసెంబ్లీలో చర్చ పెట్టు.

ఏ ఏడా ది ఎంత ఇచ్చినమో లెక్కలతో స హా చెబుతా, నేను ఆర్థిక మంత్రిగా పని చేసా, పచ్చి అబద్దం మాట్లా డుతున్నవు, నిజాలు తెల్సుకొని మాట్లాడు. మేం ఇచ్చింది తక్కువ. మీరు ఇయ్యని దాన్ని ఎక్కువ చూ పడం ఇదేం చిల్లర రాజకీయం.పది వేల కోట్ల కూడా మేం ఇవ్వలేదనే శుద్ద అబద్దం. రేవంత్ రెడ్డి పాలన చేతగాక ప్రకృతి మీద కూడా నిందలు వేసిండు.ఎండలకు పంటలు ఎండుతున్న య్యట, కేసీఆర్ ఉన్న పుడు ఎండలు లేవా, ఎండలు మొదలు పుట్టినయా రేవంత్ ముందు పుట్టిండా అని ఎద్దేవా చేశారు.

ఈ సారి సగటు వర్షపాతం కంటే ఎక్కువ నమోదైంది. కృష్ణా, గోదా వరి పొంగి ప్రవహించాయి. అన్ని రిజర్వాయర్లు నిండినయి.ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవం త్ తెచ్చిన కరువు, కేసీఆర్ హ యంలో ఉన్న నీళ్లు రవేంత్ రాంగనే ఎందుకు మాయం అయినయి. కేసీ ఆర్ నీళ్లను ఒడిసి పట్టిండు, రేవంత్ నీళ్లను వదిలి పెట్టిం డు.ఒకవైపు ఏపీ మొత్తం నీళ్లు తీసుకుపోయింది. దేవాదులో కావ ల్సినన్ని నీళ్లు ఉన్నయి.మోటర్లు ఆన్ చేయలేదు.

వరంగల్ జిల్లాల్లో లక్ష ఎకరాల్లో పం ట ఎండిపోతున్నది. 7 కోట్ల బిల్లు లు ఇవ్వలేదని దేవాదుల వద్ద 32 రోజులు కార్మికులు సమ్మె చేసారు. 32 రోజులు నీళ్ల మోటార్లు ఆన్ చేయలేదు. నీళ్లు కిందికి జారి పోయినయి. కేసీఆర్ నీళ్ల రాగానే మోటర్లు వేసేవారు. కమిషన్ కు దరక 7 కోట్ల బిల్లు ఇవ్వలేదు. కేసీఆర్ హయాంలో ఎండాకాలంలో చెరువులు మత్తల్లు దుంకెవి. కాల్వ లు నీళ్లతో కలకలలాడేవి. ప్రకృతి వైపరీత్యం కాదు, రేవంత్ వైఫల్యం, మంత్రి వర్గ వైఫల్యం, ప్రభుత్వం వైఫల్యం. ఆ రైతులను ఆదు కోవాలి, ఎకరాకు 10 ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్చేస్తున్నాం.

కేసీఆర్ నిర్మించిన సమ్మక్క సాగర్ మూడున్నర టిఎంసీ నీళ్లు ఉన్నయి. కల్వకుర్తి ఎత్తిపోతల లిఫ్టులు 25రోజులుగా ప్రారంభించ లేదు ఎవరిది పైశాచిక ఆనందం రేవంత్ రెడ్డి.హైడ్రా ఇల్లు కూలగొట్టి నువ్వు పైశాచిక ఆనం దం పొందినవు. చిన్న పిల్లలు నీళ్ల డబ్బా, పుస్తకాలు తెచ్చుకుంట అం టె టైం ఇవ్వకుండా నువ్వు పైశాచిక ఆనందం పొందినవు, లగచర్ల గిరిజన రైతులకు బేడీలు వేసి పైశాచిక అనందం పొందినవు.ఆశా వర్కర్లను పోలీసులతో ఎగిరెగిరి కొట్టించి పైశాచిక ఆనందం పొందినవు.

పేరు మర్చిపోయిండు అని అల్లు అర్జున్ ను అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందినవు.అశోక నగర్ లో నిరుద్యోగులు వీపుల పగలగొ ట్టి పైశాచిక ఆనందం పొందినవు.

గుమ్మడి నరన్సయ్య నాలుగు సా ర్లు వస్తే అపాయింట్ ఇవ్వకుండా పైశాచిక ఆనందం పొందినవు. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిదో మాట మంత్రులదో మాట. గతంలో రుణమాఫీ విషయంలో సీఎం ఒక మాట, మంత్రులు ఒక మాట. రేవం త్ రెడ్డి సలహాలు ఇవ్వమంటాడు, మొన్న మేం ఎస్ ఎల్ బీ సీ వద్దకు వెళ్తే ఉత్తం మాకు ఎవరి సలహాలు వద్దు అంటడు. 16 రోజులు అవు తున్నా 8 మంది ప్రాణాల గురించి ఈ ప్రభుత్వానికి పట్టి లేదు.

ఒక మంత్రి చాపర్ లో తిరిగితే, మరొకరు చేపల పులుసు తింటున్నడు. కన్వేయర్ బెల్ట్ ప్రారంభించడానికి పది రోజులు పట్టింది. ఒక్కరోజు నడిచి పోయిందది. ప్రభుత్వం నుంచి ఎలాంటి డైరెక్షన్ లేదు, సమన్వయం లేదు. ఇరిగేషన్ చీఫ్ అనిల్ కుమార్ ఈరోజు వరకు అక్కడికి పోలేదు. ఆయనకు ఎందుకు పోలేదు, ఆయనకు బాధ్యత లేదా ప్రమాద ఘటనను టూరిస్టు స్పాట్ లెక్క చేసారు. పదేండ్లలో తట్టెడు మట్టి తవ్వలేదని అబద్దాలు మాట్లాడారు. ముఖం పగిలే సమాధానం చెప్పినం. కాంగ్రెస్ హాయంలో రూ.3300 కోట్ల పని చేస్తే, బీఆర్ఎస్ పదేండ్లలో 3900 కోట్లు ఖర్చు చేసింది.అసహనం ఎక్కువైంది. పా లన మీద దృష్టి పెట్టి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయి. నిజాయి తీగా పాలించు కమిషన్లు మాను.

కృష్ణా నది జలాలను ఏపీ తరలిస్తే, నేడు ఖమ్మం ప్రజలకు సీతారామా సాగర్ వరమైంది. కృష్ణా, గోదావరి సంగమం ఈరోజు కేసీఆర్ వల్ల సాధ్యమైంది. ఖమ్మం రైతాంగానికి నీరు సరఫరా అవుతున్నది, రూ.400 కోట్ల సన్న వడ్ల బోనస్ తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.