Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pranay Murder case: ప్రణయ్ హత్య కేసులో న్యాయo గెలిచింది

Pranay Murder case: ప్రజా దీవెన నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో కోటి రూపాయలు సుపారీ ఇచ్చి మారుతిరావు అత్యంత కిరాత కంగా ప్రణయ్ ను హత్యగా చే యించగా పెరుమాండ్ల ప్రణయ్ హ త్య కేసులో నల్గొండ జిల్లా కోర్టు ఒ కరికి ఉరిశిక్ష మరో ఆరుగురికి జీవి త ఖై దు శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు ను కులవక్ష వ్యతిరేక పోరాట సం ఘం స్వాగతించింది.ఈ తీర్పుతో కుల దురహంకారులకు కనువిప్పు కలగాలని న్యాయం గెలిచిందని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు అన్నారు.

సోమ వారం నల్గొండ జిల్లా కోర్టు ప్రణయ్ హత్య కేసులో ఇచ్చిన తీర్పు సంద ర్భంగా ఆయన నల్గొండ లో మీడి యాతో మాట్లాడారు కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అధ్యక్షులు కొండేటి శ్రీను మరికొంత జిల్లా నాయకులతో కలి సి మీడియాతో మాట్లాడారు 2018 లో వైశ్య కులానికి సంబంధించిన అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే పేరిట పెరుమాండ్ల ప్రణయ్ అనే దళిత యువకుడిని అత్యంత కిరాతకంగా కోటి రూ పా యలు ఇచ్చి హత్యగావిం పజే సిన మారుతి రావు 2020లో ఆత్మహ త్య చేసుకున్నాడని మిగిలిన ఏడు గురు నిందితులలో ఏ2 శర్మకు ఉరి శిక్షతోపాటు మరో ఆరుగురికి జీవి త ఖైదు విధించి ఇచ్చిన తీర్పును కెవిపియ సంపూర్ణంగా స్వాగతి స్తుందన్నారు.

ఈ తీర్పు తర్వాత ప్రణయ్ కుటుంబానికి అమృత బాలస్వామికి పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని వారు కోరారు రా ష్ట్రంలో 128 కుల దృహంకార హత్యలు జరిగాయన్నారు నల్గొండ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు మిగిలిన చోట జరిగిన కుల దుర హంకారులకు కనువిప్పు కలగా లన్నారు కుల దురహంకారులను పౌర సమాజం ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖం డించాలన్నారు నాడు మారుతి రావుకు మద్దతుగా హాబతకులకు అండగా నల్గొండలో ప్రదర్శన చేసి న మతోన్మాదుల వైఖరి ని ఖం డించాలన్నారు రాష్ట్రంలో మరో కుల దురహంకార హత్య జరగ కుండా చూడాలని ఆయన కోరారు .

ఈ తీర్పు వెలువడిన తర్వాత నిందితుల తరఫున ఉన్న బంధు వులు గాని కిరాయి హంతకులు గాని ప్రణయ్ కుటుంబానికి ప్రాణ నష్టం తలపెట్టే ప్రమాదం ఉంద న్నారు. జిల్లా పోలీసులు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని వారు కోరారు ఈ పోరాటంలో మొదటి నుంచి కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం నాడు ప్రణయ్ డెడ్ బాడీ తో సుమారు 24 గంటలపాటు పో రాటంలో ప్రముఖంగా నిలబడిం దన్నారు అమృత కు అండగా ఢిpల్లీ నుంచి పార్లమెంటు సభ్యు లను రప్పించిందన్నారు తమిళనా డులో కుల దురహంకార హత్యకు గురైన ఆ పోరాటంలో గెలిచిన కౌసల్య ను అమృతకు భరోసాను ఇప్పించడం జరిగిందన్నారు.

ఈ పోరాటంలో న్యాయం వైపు బాధి తుల తరపున నిలబడ్డ న్యాయవా దులకు పోలీసులకు మీడియాకు కేవీపీఎస్ తో పాటు పోరాటంలో నిలబడ్డ సామాజిక సంఘాలకు కెవిపిఎస్ హృదయపూర్వక కృత జ్ఞతలు తెలియజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రెమిడాల పర్శరా ములు కోడి రెక్క రాధిక గాదే నర సింహ బొల్లు రవీంద్ర కుమార్ వంటే పాక కృష్ణ పెరిక విజయ్ కుమార్, కోడి రెక్క మల్లన్న దైద శ్రీను దొంతలా నాగార్జున దండు రవి వంతెపాక అయోధ్య జిల్లా నలుమూలల నుంచి కెవిపిఎస్ నాయకులు కార్య కర్తలు పెద్ద సంఖ్యలో హాజర య్యారు.