–డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్
–డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలి
— ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు
SFI State Secretary Nagaraju : ప్రజాదీవెన నల్లగొండ టౌన్ : రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన భగత్ సింగ్ వర్థంతి సందర్భంగా భగత్ సింగ్ స్మారక ఉత్సవాలను నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం అభినందనీయమని, విద్యార్థులను, యువకులు భగత్ సింగ్ ఆశయ సాధన కోసం ముందు కు వచ్చి పోరాడాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు పిలుపునిచ్చారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా వారం రోజులపాటు నిర్వహిస్తున్న స్మారక ఉత్సవ కార్యక్రమాలలో భాగంగా సోమవారం నల్లగొండ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన భగత్ సింగ్ నిజమైన దేశభక్తి గల రియల్ హిరో అని కొనియాడారు.
భగత్ సింగ్ వర్థంతి సందర్భంగా వారం రోజుల పాటు డ్రగ్స్ కు వ్యతిరేకంగా సెమినార్ లు నిర్వహించాలని చెప్పారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత భగత్ సింగ్ లాంటి గోప్ప దేశభక్తి గల నాయకుడి జీవీత చరిత్రలను పాఠ్య పుస్తకాల్లో నుంచి పూర్తిగా తోలగించడం కోసం కంకణం కట్టుకుందని అన్నారు.గల్లి స్థాయి లో కూడా త్యాగాలు చేయని వాళ్లను ఢిల్లీ స్థాయిలో ప్రచారం చేస్తున్నారని, పాలక ప్రభుత్వాలు భగత్ సింగ్ లాంటి చరిత్రలను ప్రచారం చేయడానికి పాలక ప్రభుత్వాలు జంకుతున్నాయని ఆరోపించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన యోధుడు భగత్ సింగ్ అని ఆయన ఆశయ సాధన కోసం విద్యార్థులు, యువకులు ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు ఖమ్మంపాటి శంకర్, మల్లం మహేష్ , ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్, కుర్ర సైదా నాయక్, గుండాల నరేష్, పతాని శ్రీను, కట్ట లింగస్వామి, మిర్యాల భరత్, కోరే రమేష్, బుడిగ వేంకటేష్ ముస్కు రవీందర్, పాలది కార్తీక్, మారుపాక కిరణ్, రవి, కావ్య, స్పందన, జగదీష్, జగన్ నాయక్, మాలికంటి చంద్ర శేఖర్, సంపత్, నరేష్, లక్ష్మన్, తదితరులు పాల్గొన్నారు.