Drugs : ప్రజా దీవెన, ఒరిస్సా: ఒక్కరు మంగో తరలిస్తున్న ఐదు లక్షల విలువైన గంజాయిని పోలీసులు వలవేసి పట్టుకున్నారు.ఒరిస్సా నుంచి ముంబాయికి 10 కేజీల గంజాయి అక్రమ రవాణా చేస్తుం డగా అందిన సమాచారం మేరకు ఘట్ కేసర్ సమీపంలో స్వాధీన పరుచుకొని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. భవనేశ్వర్ నుంచి ముంబా యికి కోణార్క్ రైల్లో అక్రమంగా రవాణా అవుతున్న 10 కేజీల గం జాయిని సోమవారం హెచ్ టి ఎఫ్ డీ టీమ్ పోలీసులు పట్టుకున్నారు.
ఒరిస్సాకు చెందిన దాంపా ప్రధాన్ అనే గంజాయి వ్యాపారీ ముంబా యికి 10 కిలోల గంజాయిని తర లించడానికి నందిగోస నాహక్(21) అనే వ్యక్తి ఎంచుకొని అతడితో 10 కేజీల గంజాయిని తరలించడానికి ఏర్పాటు చేశాడు.భవనేశ్వర్ నుం చి ముంబాయిలో గంజాయి ఇచ్చి వచ్చి నందుకు నాహక్కు రూ. 15 వేలు ఇస్తానని ఒప్పందాం కుదుర్చు కున్నారు
. కోణార్క్ రైల్లో పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయనే స మాచారంతో కోణార్క్ దిగి కాకతీ య రైలు నా హగ్ ఎక్కాడు. కాకతీ య రైల్లో కూడ తనిఖీలు జరుగు తున్నాయనే భయంతో ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో గంజాయితో దిగా డు. బస్సు మార్గంలోకాని మరో రై ల్లో ముంబాయికి వెలుదామని ప్ర యత్నాలు చేస్తున్న క్రమంలో ఎస్ టి ఎఫ్ డీ టీమ్ సీఐ నాగరాజ్, ఎస్సై జ్యోతి సిబ్బంది పట్టుకున్నా రు. నిందితుడి వద్ద ఉన్న రూ. 5 లక్షల విలువ చేసే 10 కేజీలగం జాయిని స్వాధీనం చేసుకొని, నింది తుడు నందిగోస నాహక్, ఆతడి వద్ద ఉన్న సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.గంజాయిని పట్టు కున్న టీమ్లో కానిస్టేబుళ్లు లేఖా సింగ్, వినోద్, కాశీలు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వి.బి కమలాసన్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ భాస్కర్, డీఎస్పీ తిరుపతి యాద వ్లు అభినందించారు.