Vice President Paladugu Prabhavathi : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: వీర నారి మల్లు స్వరాజ్యం జీవితం మ హిళా ఉద్యమానికి దిక్షుచి స్ఫూర్తి దాయకమని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి అన్నారు. బుధవారఎం దొడ్డి కొమురయ్య భావనంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, కేంద్ర కమిటీ సభ్యురాలు, తుంగతుర్తి మాజీ శాసన సభ్యురాలు మల్లు స్వరాజ్యం మూడవ వర్ధంతి సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ తరానికి ఆమెఒక స్ఫూర్తి అని ఆమె పోరాటం అందరికీ ఆదర్శం అని అన్నారు. తుపాకీ పట్టి నిజాం గడగడ లాడించిన వీరవనిత మల్లు స్వరాజ్యం అన్నారు. ఆడవాళ్లు అబలలు కాదు సభలు అని నిరూపించిన యోధురాలు మల్లు స్వరాజ్యం అన్నారు వీర తెలంగాణ సాయుధ పోరాట వారసత్వమైన లౌకికత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉందని అన్నారు. దేశంలో బిజెపి మతసామరస్యాన్ని చెడగొట్టి మతోన్మాదాన్ని పెంచి పోషించాలన్న కుట్రలను అడ్డుకోవడానికి లౌకికవాద శక్తులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. నమ్మిన ఆశయం కోసం కొట్లాడిన వీరవనిత స్వరాజమని ఆమె ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని అన్నారు. నేటి యువత కు ఆమె జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణలో మొట్టమొదటగా తుపాకీ పట్టిన మహిళాగా మల్లు స్వరాజ్యం కీర్తి ఘటించారని అన్నారు. మల్లు స్వరాజ్యమును పట్టిస్తే 10000 బహుమతి ఇస్తానని ఆనాడు నైజాం ప్రకటించడం అంటే ఆమె ఎంత గొప్పగా పోరాడారో అర్థం అవుతుందన్నారు. మహిళ ఉద్యమానికి మల్లు స్వరాజ్యం దిక్సూచిగా దిగిచారని అన్నారు. తన జీవితాంతం ప్రజల కోసం నిస్వార్ధంగా పనిచేసిన మహా నాయకురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ పోరాటం జరిగితే అక్కడ మల్లు స్వరాజ్యం ప్రత్యక్షమయ్యే వారిని పూర్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమంలో మల్లు స్వరాజ్యం నిర్వహించిన పాత్ర మరోలిందన్నారు. మహిళలకు సంపూర్ణ స్వరాజ్యంరావాలని ఆమె నిరంతరం తపించేవారని ఆ దిశగా అనేక ఉద్యమాలు నిర్వహించాలని గుర్తు చేశారు.
చట్ట సభలకు వన్నెతెచ్చిన మహానేత మల్లు స్వరాజ్యం అన్నారు. శాసనసభలో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే అధికార పార్టీ నాయకులు హాడలిపోయే వారన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించాలని అన్నారు. మహిళ అయినప్పటికీ పురుషులతో ఏమాత్రం తీసుకొని విధంగా పని చేశారని అన్నారు. నిస్వార్ధంగా ఈ ప్రాంత ప్రజల మనసును దోచుకున్న నాయకురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. నేడు దేశంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం మహిళల పట్ల చిన్నచూపు చూస్తుందని విమర్శించారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు దౌర్జన్యాలు పెరుగుతున్నాయని వాటిని ఎదుర్కొనేందుకు ప్రతి మహిళ మల్లు స్వరాజ్యం కావాలని పిలుపునిచ్చారు. స్వరాజ్యం అంటే వ్యక్తి కాదు మహా శక్తి ఆమె ఒక ఉద్యమ కిరణం అని అన్నారు. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం రైతాంగ సమస్యలను పరిష్కరించిన పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలపై ఐద్వా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలను నిర్వహిస్తుందని ఆ పోరాటాలు ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు.ఈ కార్యక్రమం లో ఐద్వా రాష్ట్రము కమిటీ సభ్యురాలు కొండా అనురాధ జిల్లా ఆఫీస్ బేరర్స్ భూతం అరుణ కుమారి తుమ్మల పద్మ జిల్లా కమిటీ సభ్యురాలు కనుకుంట్ల ఉమారాణిమేకల వరుణ నాగలక్ష్మిస్వర్ణ మమతా వెనటమ్మ తదితరులు పాల్గొన్నారు.