— ఎర్రుపాలెం రైతుల వినూత్న నిరసన
Flexi Loans : ప్రజా దీవెన, ఎర్రుపాలెం : ఎర్రుపాలెం మండల పరిధిలోని అయ్యవారి గూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం ముందు రైతు సంఘం జిల్లా నాయకులు గొల్లపూడి పెద్ద కోటేశ్వరావు అధ్య క్షతన రైతు సంఘం ఆధ్వ ర్యంలో నిరసన చేపట్టారు.ఈ కార్యక్ర మములో పాల్గొన్న రైతు సంఘం జిల్లా నాయకులు దివ్వెల వీర య్య,సిపిఎం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు మాట్లా డుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులందరికీ రెండు లక్షల రూ పాయల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి అరకోరా రుణమాఫీ చేసి రుణ మాఫీ అయిన రైతుల పేర్లును పం చాయతి కార్యాలయాల ముందు సహకార సంఘాల ముందు మె యిన్ సెంటర్లలో ఫ్లెక్సీలతో పెద్ద ఎత్తున ప్రచార హర్బటలు చేస్తూ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్విని యోగం చేస్తుందని మండిపడ్డా రు.
ఎర్రుపాలెం మండల పరిధిలోని అయ్యవారిగూడెం ప్రాథమిక వ్యవ సాయ సహకార పరపతి సంఘం నందు 191 మంది రైతులకు లక్ష రూపాయల లోపు వడ్డీని మాత్ర మే మాఫీ చేసి అసలు రుణమాఫీ చేయకపోవడం వలన పలుదపా లు అధికారులను సంప్రదించి నిర సనలు తెలిపిన సమస్య పరిష్క రించక పొగ ఈ సహకార సం ఘంలో ఉన్న 191మంది రైతులకి మొండిచేయి చూపించారని మా పేరును కూడా ఫ్లెక్సీలు వేయించి ఎందుకు రుణమాఫీ కాలేదో ప్రచా రం చేయాలని ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు.మేమే స్వయంగా నష్ట పోయిన మా రైతు పేర్లతో ఫ్లెక్సీ లను పెట్టీ ప్రచారం చేస్తామని అది చూసైనా ప్రభుత్వానికి, అధికారు లకి కనువిప్పు కలగాలని అన్నా రు.అయ్యవారిగూడెం సహకార సంఘం రుణమాఫీ చేసి రైతులకు న్యాయం చేయకపోతే దీక్షకు పూ నుకుంటామని హెచ్చ రించారు.ఈ కార్యక్రమంలో నలమోతు హను మంతరావు, గామాసు జోగయ్య, మందడపు ప్రభాకర్, షేక్ లాల, మెడగాని తిరుప తిరావు , రామిశే ట్టి సురేష్, దుదిగం బాసవయ్య, సాగ్గుర్తి సంజీవరా వు,కిషోర్, కుడేలి నాగేశ్వరరావు,గోధుమ వెంకటే శ్వరరావు షేక్ గాలిబ్, దివ్వెల వీరాంజనేయులు, యార మాల వెంకటనా రాయణ రెడ్డి, గొల్లపూడి నారాయణ తదితరులు పాల్గొన్నారు.