Big Breaking : ప్రజా దీవెన, మెదక్: మెదక్ జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచే సుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 11 మంది గాయా ల పలుకాగా నలుగురి పరిస్థితి విషమం ఉంది. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ మండల్ కోలపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుం ది. వివరాల్లోకి వెళితే విజయన గరం వాసులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శ్రీశైల నుండి తుల్జాపూర్ భవాని మాతను దర్శించుకునేం దుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద శంకరంపేట మండలం కోల పల్లి వద్దకు రాగానే ఆగి ఉన్న ట్రావె ల్ బస్సును వెనుక నుండి అతివే గంతో డీసీఎం బలంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. నారాయణమ్మ (50) సురాపమ్మ (60) మరో 11 మందికి తీవ్ర గా యాలయ్యాయి సమాచారం అం దుకున్న పెద్ద శంకరంపేట ఎస్ఐ శంకర్, సిబ్బంది అక్కడికి చేరుకొని శతఘాతులను చికిత్స నిమిత్తం జోగిపేట్ ప్రభుత్వాసుపత్రికి తర లించారు. అందులో నలుగురి పరి స్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేసు న మోదు చేసుకుని దర్యాప్తు చేస్తు న్నారు పోలీసులు.