BJP : ప్రజా దీవెన హైదరాబాద్: దేశంలోని దక్షిణ రాష్టాల్ల్రో పాగా వే యలన్నది బిజెపి ఆశలను అడ్డు కోవాలన్నది డిఎంకె తదిర ప్రాంతీ య పార్టీల వ్యూహాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అందుకే తొ లుత హిందీ వ్యతిరేకతతో మొదలై న యుద్దం ఇప్పుడు డీ లిమిటేషన్ వ్యవహారం తెరపైరకి తెచ్చారు. నిజానికి డీ లిమిటేషన్ వల్ల ప్రజల కు ఒరిగేదేవిూ లేదు. అయితే రాజ కీయం కనుక రచ్చ చేయాలన్నదే రాకీయ పార్టీల లక్ష్యం. మొన్న పార్ల మెంట్ ఎన్నిల్లో బిజెపి కోరుకున్న 400 మార్కును దాటలేక పోయా రు. దీంతో కొత్త వ్యూహాలను అమ లు చేసేందుకు సిద్దం అవుతారని అందరికీ తెలుసు. బిజెపిని అధికా రం నుంచి తొలగించకుండా పక్కా గా ప్లాన్ చేయడమెలా అన్నది మో డీ ద్వయానికి బాగా తెలుసు. అం దుకే వారు దక్షిణాది వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఉత్తరాదిలో రాముడు రక్షిస్తాడన్న ధీమా వచ్చే సింది. రామనామం ఉత్తరాదిలో ఊపేస్తోంది. అనన్య సాధ్యమైన అయోధ్య సాకారం అయ్యింది. దీంతో ఉత్తరాదిలో బిజెపికి తిరు గులేదన్న విధంగా పరిస్థితులు ఉన్నాయి. కానీ దక్షిణాది పరిస్థితి వేరు. కర్నాటక కూడా చేజారిపో యింది. తెలంగాణలో వచ్చిన అవ కాశాన్ని చేజేతులా జారవిడుచుకు న్నారు. తెలంగాణలో 17 సీట్ల కో సం పోటీపడి 8సీట్లు సాధించారు. ఇదే తరహాలో మిగతా రాష్టాల్ల్రో నూ గెలవాల్సి ఉంది. ఒడిషాలో అధికారం చేపట్టారు. అందుకే త మిళనాడు, కర్నాటక, కేరళ, తెలంగాణల్లో పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తు న్నారు. దక్షిణాదిని గుప్పిట పెట్టు కోవాలని పట్టుదలగా ఉన్నారని కనిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ ఎం పి శశిథరూర్ దారికొచ్చారు. మో డీని, ఆయన విదేశాంగ విధానాన్ని సమర్థిస్తున్నారు. ఇలా కొందరు నే తలతో బిజెపిని పొగిడిరచుకోవడం కూడా ఓ ఎత్తుగడే. తమిళనాట అ న్నాడిఎంకె దూరమైనా చిన్నాచిత క పార్టీలతో జతకట్టారు. గవర్నర్గా ఉన్న తమిళసై మళ్లీ రాజకీయ అ రంగేట్రం చేసినా ఫలితం దక్కలేదు. అయితే అన్నామలై అక్కడ గట్టిగా నే పోరాడుతున్నారు. బిజెపిని ముందునుంచి ప్రజలు ఉత్తరాది పార్టీగానే గుర్తిస్తూ వచ్చారు. అయి తే దానిని తిరగరాస్తూ కర్నాటకలో కాలుమోపారు. కానీ స్థానిక నాయ కత్వం నిర్లక్ష్యం, అవినీతి కారణం గా గత అసెంబ్లీ మూల్చం చెల్లించు కోక తప్పలేదు. బిజెపి జాతీయవా దానికి దేశవ్యాప్త ఆమోదం కోసం యత్నిస్తోంది.
భారతదేశంలో బిజె పి అంతటా విస్తరించిందని చెప్పు కోవడం కూడా అవసరం. అందుకే విజయం కోసం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా యత్నిస్తోంది. గత పదేళ్ల బిజెపి పాలనా కాలం తీసు కుంటే అన్ని రాష్టాల్ల్రో విస్తరించేం దుకు చేయని ప్రయత్నం లేదు. కేవ లం నినాదాలకే పరిమితం కాకుం డా అభివృద్ది, సెంటిమెంట్ ఎజెండా లను కలుపుకుని ప్రయత్నాలు ము మ్మరం చేసింది. ఈశాన్యంలో గతం లో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ది కి పెద్దపీట వేసింది. బెంగాల్ లోను, దక్షిణ రాష్టాల్ల్రో గెలుపు కోసం బూత్లెవల్ కార్యాచరణను అమ లు చేస్తోంది. క్షేత్రస్థాయి నుంచి పనిచేసుకుంటూ పథకం ప్రకారం బలాన్ని పెంచుకోగలిగిన శక్తిని బీజేపీ ప్రదర్శిస్తోంది. కార్యశీలురైన నాయకులు, కార్యకర్తలు దండిగా ఉన్నారు. ఫలితాలు ఎట్లా ఉన్నా, వారు అలుపెరగకుండా ప్రయత్నా లన్ని చేస్తూనే ఉన్నారు. కర్ణాటక అపజయం బీజేపీకి కొత్తేవిూ కాదు. పొత్తులతోనో, ఫిరాయింపులతోనో బీజేపీ కర్ణాటకలో ఒకటి రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక మైనర్ భాగస్వామిగా అయినా ప్రభుత్వం లో ఉన్నది. తెలంగాణలో తగినంత ఉనికితో ఎప్పటి నుంచో సత్తా చా టుతోంది. గత పార్లమెంటు ఎన్నిక లలో 8 స్థానాలతో, సుమారు 20 శాతం ఓట్లతో తన ఉనికిని విస్తరిం చుకోగలిగింది. కేరళలో 2016లో ఒక ఎమ్మెల్యేను గెలిపించుకున్న బీజేపీ, 2021లో 11 శాతానికి పైగా ఓట్లను సంపాదించింది. అక్కడక్క డా ఉనికిలో ఉన్నప్పటికీ దక్షిణాది ఇంకా పట్టుబడలేదన్న లోటు మా త్రం బీజేపీకి ఉన్నది. దక్షిణాదిలో విస్తరించాలన్న ఆకాంక్ష బీజేపీకి, మోదీకి అంతిమలక్ష్యంగా మారిం ది. అందుకే దక్షిణాదిపై ఎక్కువగా దృష్టి సారించారు. తమిళనాట చెలరేగుతున్న నిరసలు, ఉద్యమా లను తమకు అనుకూలంగా మల చుకుంటున్నారు. హిందీ వ్యతిరేక తను ప్రజలే ఛీత్కరించుకునేలా చేస్తున్నారు. డీలిమిటేషన్ కార ణంగా ఉత్తరాదిలో మరిన్ని సీట్లు పెరిగే అవకాశమున్నట్లు డిఎంకు తదితర పార్టీలు ఆందోళన చెందు తున్నాయి. తమిళనాడు, కేరళల్లో ప్రస్తుతానికి పరిస్థితి ఆశాజనకంగా ఉంది. మోడీ వ్యక్తిగత ఛరిష్మా కూ డా పనిచేస్తోంది. ఆ రెండు రాష్టా ల్ల్రో గతం కంటే ఓట్లు, సీట్లు పెంచు కోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నా రు. కర్ణాటకలో ఇప్పటికే కాంగ్రెస్ పాలన విూద విముఖత కలిగింద న్న ప్రచారం మొదలయ్యింది. గతం లో ఉన్న బలాన్ని నిలుపుకోవడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చే సారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు కావడంతో అక్కడ విజయం సా ధించడం ద్వారా కొంత పట్టు నిలు పుకుంది. పవన్ కళ్యాణ్ పేరుకు జనసేనానిగా ఉన్నా, ఆయన ఆ శలు,ఆశయాలు బిజెపితో పెనవే సుకుంటున్నాయి.
ఆయన వీరికి తురుపుముక్కగా ఉంటారనడం లో సందేహం లేదు. ఈ కలయిక దీర్ఘకాలికంగా బీజేపీ విస్తరణ ప్ర యత్నాలకు తోడ్పడగలదు. మొ న్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగా ణలో బీజేపీ ప్రభావం గణనీయంగా నే పెరిగింది. ఇప్పుడది ఆ పార్టీకి కీలకమయిన విజయం అవుతుంద ని భావిస్తోంది. తెలంగాణలో అధిక ప్రభావం చూపగలిగితే కనుక, బీజే పీ వెంటనే రెండో స్థానానికి, అతి త్వరలో అధికారస్థానానికి చేరుకోగ లుగుతుంది. దక్షిణ భారతదేశంలో తమిళనాడుతో పాటు మూడు కేం దప్రాలిత ప్రాంతాల్లో పాగా కోసం బిజెపి అహరహరం అందుకే కృషి చేస్తోంది. డిఎంకె ఎత్తులకు పైఎత్తు లు వేస్తోంది. వారు చేసే డీలిమిటే షన్, హిందీవ్యతిరేక ఆందోళనల ను తనకు అనుకూలంగా మలచు కుంటోంది. తమిళనాడులో గత బీజేపీకి ప్రస్తుత బీజేపీకి పూర్తిగా తేడా కనిపిస్తోంది. రాష్ట్ర అధ్యక్షు డిగా అన్నామలై బాధ్యతలు స్వీ కరించినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పార్టీ బలపడుతూ వస్తోంది. పాద యాత్రలతో పాటు డీఎంకే అవినీతి పై ఆయన ఆరోపణలు చేస్తూ ఆధారాలు విడుదల చేశారు. దీం తో డీఎంకే సైతం బీజేపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. దీంతో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య పో రు డీఎంకే, బీజేపీగా అన్నామలై మా ర్చేశారు. ప్రధాని మోదీ సైతం తమి ళనాడుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇలా కేరళలోనూ ప్రయత్నాలు సా గుతున్నాయి. ఈ క్రమంలో బిజెపికి కేంద్రంలో అధికారంలో ఉండడం కలసి వస్తోంది.