Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Anirudh : ఎమ్మెల్యే అనిరుధ్ అరోపణలు, సీ లింగ్ భూములు తిరిగి తీసుకున్న దొరలు

MLA Anirudh :  ప్రజా దీవెన, జడ్చర్ల : రంగారెడ్డి జిల్లా కొండకల్, సంగారెడ్డి జిల్లా వెలిమల గ్రామాల్లో సీలింగ్ చట్టం కింద జాగీర్దార్ల నుంచి ప్రభుత్వం తీసుకున్న భూమిని మళ్లీ దొరలకు ఇచ్చారని, ఒకసారి సీలింగ్ లో తీ సుకున్న భూములను మళ్లీ అదే దొరలకు వెనక్కి ఎలా ఇస్తారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరు ధ్ రెడ్డి ప్రశ్నించారు. కొండకల్, వెలి మల గ్రామాల్లో భూముల వ్యవహా రంతో పాటుగా మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలానికి చెం దిన చొక్కంపేట్, తిర్మలాపూర్ గ్రా మాల్లోనూ దొరలు సీలింగ్ లో ఇచ్చి నభూములను మళ్లీ తిరిగి తీసుకో వడంపై ప్రభుత్వం విచారణ జరి పించాలని ఆయన డిమాండ్ చేశారు.శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశం జీరో అవర్ లో అనిరు ధ్ దొరలు వందల ఎకరాల భూము ల విషయంలో చేస్తున్న అక్రమాల ను లేవనెత్తారు. కొండకల్, వెలిమ ల గ్రామాలలో ఉన్న భూములను అక్కడి దొరలు ల్యాండ్ సీలింగ్ కిం ద ప్రభుత్వానికి అప్పగించారని చె ప్పారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దొరల తాత ముత్తాతలు చదువుకోని నిరక్షరా స్యులనే నెపంతో అవే భూములను దొరలకు తిరిగి ఇచ్చారని, ఇలా ఇకటి రెండు ఎకరాలు కాకుండా ఏకంగా 1100 ఎకరాల భూముల దాకా మళ్లీ దొరల చేతుల్లోకి వెళ్లి పోయాయని తెలిపారు. దొరల కు టుంబాలలో చదువుకోని వారు ఉంటారా అని ఆయన ప్రశ్నించా రు. లాండ్ సీలింగ్ చట్టం కింద దొర ల నుంచి ప్రభుత్వం తీసుకున్న భూ ములను మళ్లీ వాళ్లకే ఎలా తిరిగి ఇస్తారని నిలదీసారు. ఈ భూముల తో తన జడ్చర్ల నియోజకవర్గం లో ని చొక్కంపేట్, తిర్మలాపూర్ గ్రామా లకు చెందిన దొరల భూములతో నూ లింక్ ఉందని వెల్లడించారు. కొండకల్, వెలిమల తరహాలోనే చొక్కంపేట్, తిర్మలాపూర్ గ్రామా ల్లోనూ సీలింగ్ లో దొరల నుంచి తీసుకున్న భూములలో 700 ఎకరాల భూమి వరకూ సాదా బైనామాల సాయంతో దొరలు మళ్లీ తామే తీసుకున్నారని అనిరుధ్ రెడ్డి వివరించారు. ఇదంతా గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారమ ని, ఈ భూముల వ్యవహారంపై ప్ర భుత్వం విచారణ జరిపించాలని, పేద దళిత, గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు.

కాగా రాజాపూర్ మండలంలోని ఖానాపూర్ గ్రామానికి తన తాత జగన్నాథరెడ్డి జాగీర్దార్ గా ఉండే వారని, ఖానాపూర్ తన తాత మ క్తాగా ఉండేదని తెలిపారు. సీలింగ్ చట్టం వచ్చిన సమయంలో తమ కుటుంబం ఖానాపూర్ లోని వేలాది ఎకరాల భూములను ప్రభుత్వానికి అప్పగించడం జరిగిందని చెప్పా రు. అయితే ఈ విధంగా తాము ప్రభుత్వానికి అప్పగించిన భూము ల్లో 250 ఎకరాల భూమిని పొరపా టున మళ్లీ తమ కుటుంబానికి చెం దిన బూమిగా రికార్డుల్లో రాసారని అనిరుధ్ రెడ్డి తెలిపారు. అయితే ఈ భూములను చాలా కాలంగా పేదలు, గిరిజనులు సాగు చేసుకుం టున్నారని, 2007 వరకూ కూడా ఈ భూములకు చెందిన హక్కుల న్నీ వారికే ఉండగా ఈ మధ్యకా లంలో పొరపాటున మళ్లీ వాటిని తమ కుటుంబ భూములుగా రికా ర్డుల్లో నమోదు చేసారని వివరించా రు. అయితే ఈ భూములను దు న్నుకుంటున్న పేదలకే ఆ భూముల ను తిరిగి ఇచ్చేయాలని కోరారు. ఈ మేరకు రికార్డుల్లో మార్పులు చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ ఇంటికి వచ్చినప్పుడు ఖానాపూర్ భూములను గురించి వినతి పత్రం కూడా ఇచ్చానని వెల్లడించారు.

కాగా తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ పట్టిం చుకోవడం లేదని, ఆంధ్ర రాష్ట్ర ప్ర జా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యం ఇస్తున్న తరహాలోనే తె లంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలపై కూడా విఐపి దర్శనాలు ఇవ్వాలనే విషయం గురించి మొదటగా తానే మాట్లాడానని అనిరుధ్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసారు. ఈ విషయం గురించి తాను మాట్లాడి న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ, స్పీకర్ గడ్డం ప్రసాద్ తది తరులు కూడా మాట్లాడటంతో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలపై వారానికి 4 రోజులు దర్శనాలను కేటాయించ డానికి అంగీకరించారని చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల కు కూడా వారానికి 7 రోజులు వీఐ పీ దర్శనానికి అనుమతి ఉండేదని ప్రస్తావించారు. అదే తరహాలో ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల కు వారానికి 7 రోజులు వీఐపీ దర్శనాలకు అనుమతించాలని అనిరుధ్ రెడ్డి కోరారు. కాగా ఈ విషయాలను నోట్ చేసుకున్నామ ని, వీటిపై తగిన చర్యలు తీసుకుం టామని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు సభలో హామీ ఇచ్చారు.