Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KTR : కేటీఆర్ ఘాటు వ్యాఖ్య, డీలిమిటే ష‌న్ తో బానిస బతుకులే

KTR : ప్రజా దీవెన, చెన్నై: దేశంలో జ‌నా భా ప్ర‌తిపాదిక‌న డీలిమిటేష‌న్ జ‌రి గితే ద‌క్షిణాది రాష్ట్రాల‌కు ఇక రాజ‌ కీయ స‌మాధేనని బిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హెచ్చ‌ రించారు. ద‌క్షిణాది రాష్ట్రాల హ క్కులు హ‌రించేందుకు, రాజ‌కీయ గొంతు కోసేందుకే కేంద్రం ఈ ప్ర‌తి పాద‌న‌ను ముందుకు తీసుకొచ్చిం ద‌ని వ్యాఖ్యానించారు. చెన్నైలో శనివారం జ‌రిగిన అఖిల‌ప‌క్ష స‌మా వేశంలో బిఆర్ఎస్ పార్టీ గొంతును వినిపించారు. డీలిమిటేషన్ కు తా ము పూర్తిగా వ్యతిరేకమని చెప్పా రు. డీలిమిటేషన్ తో దక్షిణాది రా ష్ట్రాలకు తీరని అన్యాయం జరుగు తుందని అన్నారు. ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే నిధు లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెపు తోందని, డీలిమిటేషన్ జరిగితే దక్షి ణాది రాష్ట్రాలకు ఏమాత్రం విలువ లేకుండా పోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎం పీ స్థానాలు భారీగా పెరుగుతా యని, అప్పుడు దక్షిణాది రాష్ట్రా లపై కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేదని అన్నారు. డీమిటేష‌న్ తో ద‌క్షిణాది రాష్ట్రాలు కేంద్రం గుప్పిట్లోకి వెళ్లిపో తాయ‌న్నారు. ఇప్ప‌డు అంద‌రం క‌లిసిక‌ట్టుగా వ్య‌తిరేకించ‌క‌పోతే బానిస బతుకులే అవుతాయ‌ని హెచ్చ‌రించారు.

దేశ జనాభాల్లో 2.8 శాతం జనాభా ఉన్న తెలంగాణ దేశ జీడీపీలో 5.1 శాతం సమకూర్చుతోందని కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే అన్ని ట్యాక్స్ ల పేరుతో తెలంగాణ నుంచి రూపా యి తీసుకుని 25 పైసలు మాత్రమే తెలంగాణకు తిరిగి ఇస్తోందని వి మర్శించారు. డీలిమిటేషన్ తో ని ధుల పరంగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర వివక్షకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది ఇలా ఉంటే త‌దుప‌రి అఖిల‌ పక్ష స‌మావేశం హైద‌రాబాద్ లో నిర్వ‌హించాల‌ని చెన్నై స‌మావే శంలో నిర్ణ‌యించారు. దీనికి హాజ‌ రైన 14 పార్టీల నేత‌లు ఆమోదిం చారు. నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను తె లంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కి అప్ప‌గించారు. నిర్వ‌హ‌ణ తేదీల‌ ను త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామన్నారు. ఈ స‌మావేశానికి టిడిపి, జ‌న‌సేన పార్టీ ల‌ను కూడా ఆహ్వానించాల‌ని నిర్ణ‌ యించారు.