టీటీడీ కీలక ప్రకటన, ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
TTDannouncement: ప్రజా దీవెన తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మం డలి కీలక ప్రకటన వెలువరించింది. ఈ నెల 25,30 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రక టించింది.25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 30న ఉగాది సం దర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను ఈ నెల 23న స్వీకరించి 24న దర్శ నాలకు అనుమతి ఉంటుందని గుర్తు చేసింది.
ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబం ధించి కీలక ప్రకటన చేసింది. తిరు మల శ్రీవారి ఆలయంలో ఈ నెల 25న కోయిల్ ఆళ్వార్ తిరుమం జనం వేడుక, 30న ఉగాది వేడుక జరగనున్న నేపథ్యంలోనే 25, 30 తేదీల్లో వీఐ పీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు శనివారం టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ రెండు రోజుల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేసినందున 24, 29 తేదీల్లో ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించడం జరగదని స్పష్టం చేసింది.తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను ఈ నెల 23న స్వీకరించి 24న దర్శనానికి అనుమతించనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది.