Chief Minister A. Revanth Reddy : ప్రజా దీవెన హైదరాబాద్: భక్తుల కొంగుబంగారం భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో పా ల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఆదివారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్య మంత్రిని కలిసిన మంత్రి కొండా సురేఖ , భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానం అర్చ కులు, అధికారులు ఈ మేరకు ఆ హ్వాన పత్రిక అందించారు. సీఎం తో పాటు ఉప ముఖ్యమంత్రి మ ల్లు భట్టివిక్రమార్కికి, మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావుకి కూడా ఆహ్వా నం అందించారు.
భద్రాద్రి శ్రీరామన వమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ను ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం, మంత్రులతో కలిసి ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా జరిగిన సమా వేశంలో భద్రాచలం రాములవారి ఆలయ అభివృద్ధికి సంబంధించి అవసరమైన భూసేకరణ, ఇతర వివరాలను ముఖ్యమంత్రి అధికా రులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన భూసేకరణ, నిధుల కు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామ య్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు, తది తరులు పాల్గొన్నారు.