Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు బోల్తా పడి ఒకరి దుర్మరణం

Road Accident : ప్రజా దీవెన , నాగపూర్ : కాశీ యాత్రలో విషాదం నెలకొంది. హైదరా బాద్‌లోని అల్లాపూర్‌ నుంచి కాశీ యాత్రకు బయల్దేరిన 12 మందిలో ఒకరు మృతి చెందగా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 21న నాగపూర్‌లో జరిగిన ఈ ప్ర మాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అల్లాపూర్ డివిజన్ ప రిధి రామారావు నగర్‌కు చెందిన మల్లమ్మ (50) తన బంధువులతో కలిసి ఈ నెల 16న కాశీయాత్రకు రైలులో బయల్దేరింది. కాశీ యాత్ర ముగించుకుని ఈనెల 21న హైద రాబాద్‌కు తిరుగు ప్రయాణమైంది. ఈనెల 21న సుమారు మూడు గం టల ప్రాంతంలో నాగపూర్‌ సమీపం లోని ఘాట్‌ రోడ్డు వద్ద ఆమె ప్రయా ణిస్తున్న బస్సు అదుపుతప్పి లో యలో పడిపోయింది.

దీంతో బ స్సులో ప్రయాణిస్తున్న మల్లమ్మ అ క్కడికక్కడే మరణించింది. మిగి లిన 11 మంది తీవ్రంగా గాయపడ్డా రు. ప్రమాదం గురించి తెలుసుకు న్న కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవ రం కృష్ణారావు నాగపూర్‌ లోని అధికారులతో మాట్లాడి క్షత గా త్రులకు మెరుగైన వైద్యం అందిం చాలని కోరారు. మల్లమ్మ మృతదే హాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చేం దుకు కృషి చేస్తున్నామని పేర్కొ న్నారు.