Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Big Braking News : బిగ్ బ్రేకింగ్, రోడ్డు ప్రమాదంలో ర్యా పిడో డ్రైవర్‌ దుర్మరణం

Big Braking News : ప్రజా దీవెన హైదరాబాద్: మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా జీనోమ్‌ వ్యాలీ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పని ముగించుకుని ఇం టికి వెళ్తున్న వ్యక్తిని ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టిన ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించా డు.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం తుర్కపల్లికి చెందిన షాదు ల్లా (27) రాపిడో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.సోమవారం మధ్యాహ్నం బైక్‌పై కొల్తూర్‌ వైపు నుంచి ఇంటికి వెళ్తుండగా ఆర్‌కే ట్రావెల్స్‌కు చెందిన బస్సు అతి వేగంతో వచ్చి ఢీకొట్టింది. భారత్‌ బ యోటిక్‌ ముందు జరిగిన ఈ ప్రమా దంలో షాదుల్లా తలకు బలంగా గాయాలవ్వడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న జీనోమ్‌ వ్యాలీ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహానికి పంచ నామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.