CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో సంచలనం సృష్టించిన బెటిం గ్ యాప్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రత్యక్షంగా ని ర్వహించినా, పరోక్షంగా ప్రోత్సహిం చినా ప్రభుత్వం కఠిన చర్యలు తీ సుకుంటుందని ముఖ్యమంత్రి ఎ.రే వంత్ రెడ్డి హెచ్చరించారు. ఇలాంటి వాటిని నిరోధించడానికి, నిషేధించ డానికి పూర్తి స్థాయి అధికారాలతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పా టు చేస్తామని చెప్పారు. శాసనస భలో బడ్జెట్ పద్దులపై చర్చ సంద ర్భంగా సభ్యుల నుంచి వచ్చిన ప్ర స్తావనపై ముఖ్యమంత్రి జోక్యం చే సుకుని, ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ రమ్మీ వంటి వాటి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో చే సిన వ్యాఖ్యలు ఆయన మాటల్లో నే …కేవలం ప్రచారం క ల్పించే వారి ని విచారించడం ద్వారా ఈ సమ స్యకు శాశ్వత పరిష్కారం లభించ దు. ఈ బెట్టింగ్, గేమింగ్ యాప్ల వల్ల ఎంతో మంది బలవుతున్నా రు. కేవలం రాష్ట్రంలో చర్యలు తీ సుకున్నంత మాత్రాన సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు. ఇ తర రాష్ట్రాలతో పాటు దేశ విదే శా ల నుంచి ఆపరేట్ చేస్తున్న నిర్వా హకులపై చర్యలు తీసుకోవాలి.
వీటిని నిషేధిస్తూ 2017 లో చట్టం చేసినప్పటికీ పకడ్బందీగా అమలు చేయడంలో కొంత నిర్లక్ష్యం జరిగిం ది. ఈ మధ్య కాలంలో చాలా వేగం గా దుర్వినియోగం జరుగుతోంది. రాష్ట్ర స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ రకాల సంస్థ లు, వ్యక్తులు, వివిధ దేశాలకు చెం దిన నేరగాళ్లు ఇందులో పాల్గొంటు న్నారు. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహ కులకు చట్టంలో కఠినమైన శిక్షలు కూడా లేవు. శిక్షను పెంచుతూ చ ట్టంలో అవసరమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్, ఆన్ లైన్ ర మ్మీ మాత్రమే కాదు. గంజాయి, కొ కైన్, కోడి పందాల్లాంటి ఇతర వ్యస నాలకు కూడా తెలంగాణలో తా వులేదు. తెలంగాణను ఒక ఆదర్శ వంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దా లన్న లక్ష్యంతో ముందుకు పోతు న్నాం. ధరల నియంత్రణలో, ఉద్యో గ, ఉపాధి అవకాశాలు కల్పించడం లో తెలంగాణ ముందున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తామెక్కడా డాంబికాలకు గొప్ప లకు పోకుండా వాస్తవ పరిస్థితుల కు అద్దం పట్టే విధంగా రూపొందిం చాం. చేసేదే చెప్పాం. చెప్పిందే చే స్తామన్న విధానంలో బడ్జెట్ను నియంత్రించాం. గచ్చిబౌలిలోని భూమి సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోనిది కాదు. యూనివర్సిటీ కి ఎలాంటి సంబంధం లేదు.
గతం లో ఐఎంజీ భారత్ అనే ఒక బోగస్ కంపెనీకి కేటాయించిన భూమిని 2006 లో ఆనాటి కాంగ్రెస్ ప్రభు త్వం రద్దు చేసింది. దాదాపు 25 సంవత్సరాల పాటు న్యాయస్థా నాల్లో కేసు పెండింగ్లో ఉంది. గత ప్రభుత్వంలో ఆ భూమిని వెనక్కి తిరిగి తీసుకోవాలన్న ప్రయత్నాలు చేయలేదు. తాను అధికారం చేప ట్టిన తర్వాత సుప్రీంకోర్టులో పోరా డి ఆ కేసు గెలిచి భూమిని వెనక్కి తీసుకున్నాం. అభివృద్ధిలో భాగం గా ఆ భూమిని టీజీఐఐసీకి కేటా యించాం. అక్కడ ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు రావడానికి ఒక స్పష్టమైన ప్రణాళికాబద్ధమైన అభి వృద్ధి ప్రణాళిక తయారు చేయమ న్నాం. రకరకాల ప్రచారాలు చేస్తు న్నట్టు అది రిజర్వు ఫారెస్ట్ కాదు. కాలుష్య కారక ఫార్మా పరిశ్రమల ను కాదని, నెట్ జీరో సిటీ చేయాల న్న ఒక మంచి సంకల్పంతో 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నాం. పరి శ్రమల ఏర్పాటు, ఇతరత్రా భూసేక రణకు సంబంధించి భూమి కోల్పో తున్న వారి బాధను దృష్టిలో ఉం చుకొని వారికి ఏ రకంగా నష్టపరి హారం చెల్లిద్దామన్న విషయంలో సూచనలు ఇవ్వాలి. భూములను కోల్పోతున్న వారిని ఆదుకునే బా ధ్యత ప్రభుత్వానిది. అలాంటి కుటుంబాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిద్దామని ముఖ్య మంత్రి వివరించారు.