Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Amazon : అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లకు షాక్, వేర్‌హౌస్‌లపై బీఐఎస్‌ దాడులు

Amazon : ప్రజా దీవెన హైదరాబాద్: అమె జాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వేర్‌హౌస్‌లపై బ్యూ రో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ గు రువారం భారీ దాడులు నిర్వహిం చింది. ఈ సందర్భంగా సరైన నా ణ్యతా ధ్రువీకరణపత్రాలు లేని ఉ త్పత్తులను స్వాధీనం చేసుకున్నది. మార్చి 19న మోహన్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని అమె జాన్ సెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గి డ్డంగిలో ఈ దాడి 15 గంటల పా టు తనిఖీలు నిర్వహించింది. గీజ ర్లు, ఫుడ్‌ మిక్సర్లు సహా 3500పైగా ఎలక్ట్రిక్‌ ఉత్పత్తులను బీఐఎస్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నా రు. వాటి విలువ దాదాపు రూ.70 లక్షలు. ఫ్లిప్‌కార్డ్‌ అనుబంధ సంస్థ ఇన్‌స్టాకార్ట్‌ సర్వీసెస్‌పై నిర్వహించి న దాడుల్లో అవసరమైన తయారీ గుర్తులు లేని 590 జతల స్పోర్ట్స్‌ ఫుట్‌వేర్‌ను స్వాధీనం చేసుకున్నా మని వాటి విలువ రూ.6లక్షలుగా ఉంటుందని అధికారిక ప్రకటనలో బీఎస్‌ఐ పేర్కొంది.

నాణ్యత ప్రమా ణాలు పాటించేలా దేశవ్యాప్తంగా చేపడుతున్న డ్రైవ్‌లో భాగంగా ఈ-కామర్స్‌ వేర్‌హౌస్‌లలో తనిఖీ లు నిర్వహించినట్లు పేర్కొన్నారు. గత నెలలో ఢిల్లీ, గుర్గావ్‌, ఫరీదా బాద్‌, లక్నో, పెరంబుదూర్‌ సహా అనేక ప్రాంతాల్లో ఇదే తరహాలో దా డులు జరిగాయని పేర్కొంది. విని యోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి, నాణ్యత ప్రమా ణాలను పర్యవేక్షించేందుకు ఈ దా డులు కీలకమైన ప్రకటనలో పేర్కొం ది. ప్రస్తుతం 769 ఉత్పత్తి కేటగిరీ లకు బీఐఎస్‌ నుంచి తప్పనిసరిగా ధ్రువీకరణ అవసరం. సరైన లైసెన్స్‌ లేకుండా ఈ వస్తువులను అమ్మ డం, పంపిణీ చేస్తే చట్టపరంగా జరి మానా విధించనున్నది. 2016 బీఐ ఎస్‌ చట్టం ప్రకారం జైలు శిక్షతో పా టు జరిమానాలు విధించే అవకా శం ఉంది. అయితే, ఈ దాడులపై అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పటి వరకు స్పందించలేదు.