Pastor Praveen Pagadala : ప్రజా దీవేన, కోదాడ: పట్టణములోని స్థానిక కట్ట బజార్ కోదాడ పిడబ్ల్యూఐ హోరేభూ ప్రార్థన మందిరం ఆవరణలో శుక్రవారం క్రైస్తవ నాయకుల పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మరణం క్రైస్తవ లోకానికి తీరనిలోటు,వారి ఆత్మకు ప్రగాఢ సంతాపాన్ని సమావేశాన్ని నిర్వహించారు .
ఈ సందర్భంగా చర్చి పాస్టర్ మాడుగుల సుందర్ రావు మాట్లాడుతూ క్రైస్తవ సమాజం కొరకు అలుపెరుగని పోరాటం చేసిన దైవజనుడు ప్రవీణ్ పగడాల అనాధల ఆశ్రయము నిర్వహిస్తూ వందల మందికి సహకారా అందిస్తున్న గొప్ప దైవజనుడు అని తెలిపారు సేవకుల పక్షాన నిలబడి పోరాడిన గొప్ప యోధుడని తనకిచ్చిన వాక్ స్వాతంత్రముతో అనేక మంది దారి తప్పిన వారిని సరైన దారిలో పెట్టిన గొప్ప దైవజనుడని కొనియాడారు.
ఆయన అకాల మరణానికి కోదాడ క్రైస్తవులు అందరూ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శిల్వే కొత్తపల్లి,రాజేష్,ప్రభుదాస్,జోసఫ్దే,దైవసహాయం,నెహెమ్యా,ప్రభుదాస్,రాహుల్ అనేకులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.