Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Uttam Kumar Reddy : ఉగాది నుండి పేదోడి ఇంట ప్రతి రోజు పండగే.

*సీఎం సభకు కోదాడ కొదమ సింహాలు వేలాదిగా తరలిరావాలి.
*అర్హులందరికీ రేషన్ కార్డులు: మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి

Minister Uttam Kumar Reddy : ప్రజా దీవేన, కోదాడ:ఉగాది పర్వదినం నుండి పేదోడి ఇంట ప్రతి రోజు పండుగే అని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం హుజూర్ నగర్ ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లపై కోదాడలో ఎమ్మెల్యే గారి ఇంట్లో కార్యకర్తలతో కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి తో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ హుజూర్ నగర్ నుండి రాష్ట్ర ప్రజలకి సన్నబియ్యం పంపిణి అందించటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

గడిచిన 15 నెలలో కోదాడ నియోజకవర్గం లో రోడ్లు, లిప్ట్ ఇరిగేషన్ పథకాలు, యంగ్ ఇండియా పాఠశాలలు లాంటివి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టామని దీనికి కృతజ్ఞతగా కోదాడ కొదమ సింహాలు ముఖ్యమంత్రి సభకి వేలాదిగా తరలి రావాలని మంత్రి పిలుపునిచ్చారు.గత పదేళ్లుంగా పాలకులు ఒక తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదని మన ప్రభుత్వం రాగానే పేదోడి గురించి అలోచించి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తామని,కార్డులో ఉన్న ప్రతి ఒకరికి 6 కేజీ ల సన్నబియ్యం ఉచితంగా ఇస్తామని,ఎ పి ఎల్ కుటుంబ సభ్యుల కొరకు ఆకుపచ్చ కార్డు ఇవ్వబోతున్నామని ఈ సందర్బంగా మంత్రి ప్రకటించారు.

కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల నుండి ప్రతి ఒక్కరు ప్రతిష్టత్మాకంగా తీసుకొని కార్యకర్తలు స్వచ్చందంగా తరలి రావాలని 50 వేల నుండి 60 వేల వరకు హాజరు అయి సభను రాష్ట్రం లో ఎక్కడ జరగనంత విధంగా జరిపి విజయవంతం చేయాలనితెలిపారు.ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న, పి సి సి డెలిగేట్ మెంబర్ చింతల లక్ష్మీనారాయణ రెడ్డి,జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.