Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Samel : ఇండోర్ స్టేడియం ను నిర్మాణానికి కృషి చేస్తా.

MLA Samel : ప్రజా దీవెన,శాలిగౌరారం ఏప్రిల్ 2  : శాలిగౌరారం లో అన్ని హంగుల తో ఇండోర్ స్టేడియం ను నిర్మించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు.బుధవారం శాలిగౌరారం పోలీస్ స్టేషన్ ప్రక్కన గల ప్రభుత్వ స్థలం 494 సర్వే నెంబర్ లో ఉన్న 20 గుంటల భూమిని ఇండోర్ స్టేడియం నిర్మాణం కొరకు నల్గొండ ఆర్ డి ఓ యానాల అశోక్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే మందుల సామెల్ పరిశీలించారు. ఈ సందర్బంగా సామేల్ మాట్లాడుతూ శాలిగౌరారం లో క్రీడాకారులు ఎక్కువగా ఉన్నారని వారు క్రీడా నైపుణ్యం పెంపొదించుకొనుటకు వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.క్రీడాకారులు, యువతీ యువకులు సౌకర్యంగా శాలిగౌరారం లో అన్ని వసతుల తో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి త్వరలో చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే సామెల్ అన్నారు. ఆర్ డి ఓ యానాల అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఇండోర్ స్టేడియం నిర్మాణం కొరకు ఈ స్థలం ఎంతో అనువుగా ఉందన్నారు.స్థల పరిశీలన నివేదిక ను కలెక్టర్ ఇలా త్రిపాఠీ కి పంపుతామన్నారు.

 

ఈ కార్యక్రమం లో తహసీల్దార్ యాదగిరి, ఎంపీడీఓ జ్యోతి లక్ష్మి,మండల కాంగ్రెస్ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అన్నెబోయిన సుధాకర్, జిల్లా పార్టీ కార్యదర్శి గూని వెంకటయ్య, మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పాదూరి శంకర్ రెడ్డి, వైస్ ఛైర్మెన్ నరిగే నర్సింహా, మాజీ వైస్ ఎం పి పి భూపతి అంజయ్య, నాయకులు షేక్ ఇంతియాజ్ అహ్మద్, నోముల జనార్దన్, బోడ విజయకుమార్,ననుబోతు అంజయ్య,పుల్లూరి దేవేందర్,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వేముల గోపినాథ్, కార్యదర్శి పోల్దాస్ నరేష్, మండల అధ్యక్షులు బొల్లికొండ గణేష్, ఉపాధ్యక్షులు నూక కిషోర్ కుమార్,నాయకులు వేముల భరత్, మిర్యాల సాయి,ఆర్ ఐ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.