Big Breaking : ప్రజా దీవెన హైదరాబాద్: హైదరా బాద్ పహడిషరీఫ్ స్టేషన్ పరిధిలో ఓ కామాంధునికి న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. పహడిషరీఫ్ స్టేషన్ పరిధిలో స్నేహి తుడి కూతురి మీద లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి పోక్సో చ ట్టం ప్రకారం పదేళ్ళ కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
పహడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరి ధిలో ఒక వ్యక్తి తన అనారోగ్య కార ణాల వల్ల తాత్కాలికంగా తన కూ తురి సంరక్షణను కొన్ని రోజులు అ తని స్నేహితుడికి అప్పగించగా, స దరు స్నేహితుడు ద్రోహబుద్ధితో ఆ బాలికకు మాయ మాటలు చెప్పి, ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిం చి, లైంగిక దాడికి పాల్పడిన సంఘ టన Cr.NO 476/2021 కేసులో నిందితుడు సయ్యద్ హాజీ అలీ అనే బాలాపూర్ వాసిని దోషిగా నిర్ధారించారు. పహడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసు లో U/S 420,363,376 IPC & section 3&4 ఆఫ్ పోక్సో చట్టం మరియు పహడిషరీఫ్ స్టేషన్ SC NO 614/2022, అత్యాచారం మ రియు పోక్సో చట్టం ప్రకారం ఎల్ బి నగర్లోని రంగారెడ్డి జిల్లా గౌరవ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి శుక్రవారం నిందితుడిని దోషిగా ని ర్ధారించారు. ఈ కేసులో నిందితు డికి పదేళ్ళ కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15 వేలుజరిమానా వి ధించారు. అదే సందర్భంలో బా ధి తురాలికి రూ.5 లక్షలు పరిహారం అందించబడింది. ఈ కేసులో అద నపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సునీత, డి.రఘు వాదనలు వినిపించారు.