— రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి
Minister Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన,నార్కట్ పల్లి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం పేదవాడి ఆ త్మగౌరవ పథకం అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అ న్నారు.శనివారం ఆయన నల్గొండ జిల్లా, నార్కెట్ పల్లి మండలం, ఎల్లారెడ్డిగూడెంలో నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశంతో కలిసి సన్న బియ్యం లబ్ధిదారు మేడి అ రుణ ఇంట్లో సన్నబియ్యంతో వం డిన భోజనం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అ యిందని, అయితే ప్రభుత్వం ఇచ్చి న వాగ్దానాలు మాత్రమే కాకుండా, ఇవ్వని హామీలనుసైతం అమలు చేస్తున్నదని, ఉచిత బస్సు, 500 రూపాయలకే ఎల్పీజీ కనెక్షన్, గృ హజ్యోతి, రైతు భరోసా, రైతు భీమా, రుణమాఫీ వంటి పథకాల ను అమలు చేస్తున్నామని, త్వర లోనే రాజీవ్ యువశక్తి పథకం కింద నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కింద నాలుగు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం ఇవ్వనున్నమన్నారు. సన్న బి య్యం పథకం పేదవాడి ఆత్మగౌరవ పథకం అని, అలాంటిది జగ్జీవన్ రామ్ జయంతి రోజున పేద దళిత మహిళ అరుణ ఇంట్లో భోజనం చేయడం సంతోషంగా ఉందన్నా రు.
నిజమైన తెలంగాణ పేదవాడు కల ల కన్న తెలంగాణ ఇదేనని ఆయన తెలిపారు. ఇప్పటివరకు దొడ్డు బి య్యం ఇస్తే వాటిని పాలిష్ చేసి తి రిగి రీసైకిలింగ్ చేసి మిల్లర్లు అమ్ము తున్నారని, దీన్ని దృష్టిలో ఉంచు కొని ఉగాది రోజున రాష్ట్ర ముఖ్య మంత్రి ఏ .రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్నగర్ నుండి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభిం చడం జరిగిందని చెప్పారు.
3 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తు న్నామని తెలిపారు. తాము 21 ల క్షల మంది పేర్లను రేషన్ కార్డులలో కొత్తగా చేర్చడం జరిగిందని, మరో 21 లక్షలు చేర్చనున్నామని తెలి పారు. గత ప్రభుత్వ హాయములో బ్రాహ్మణ వెళ్లెముల పథకాన్ని మూ లన పెట్టిందని ,పదేళ్లలో నత్త నడక నడిచిన బ్రాహ్మణ వెల్లేములకు 10 0 కోట్ల రూపాయలను కేటాయించి బ్రాహ్మణ వెళ్లేములకు నీటిని తీసు కురావడం జరిగిందన్నారు.
తమ ప్రభుత్వ హాయంలో పేదల కళ్ళలో సంతోషం కనబడుతున్నద ని అన్నారు. చిన్నతనంలో తాను కూడా కింద కూర్చుని ఇలాగే భోజ నం చేశానని ,తమ ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూస్తుందని, కులమతాలకు అతీతంగా అంద రూ మంచి చదువులు చదువుకో వాలని యంగ్ ఇండియా రెసిడెన్షి యల్ పాఠశాలలను ఏర్పాటు చే స్తున్నామని అన్నారు.
అణగారిన వర్గాల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషి మరువ లేనిదని చెప్పారు. రాబోయే కాలం లో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిర మ్మ ఇండ్లను ప్రభుత్వం నిర్మించి ఇ వ్వనున్నదని, ముందుగా ఫ్లాట్లు ఉ న్నవారికి ఇండ్లు నిర్మించి ఇస్తుం దని, ప్లాట్లు లేని వారికి స్థలం ఇచ్చి ఇండ్లు నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.
ఆదివారం నిర్వహించనున్న శ్రీరా మనవమి సందర్భంగా ఆయన రాష్ట్ర, జిల్లా ప్రజలకు శ్రీరామనవ మి శుభాకాంక్షలు తెలియజేశారు. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఆర్డి ఓ వై. అశోక్ రెడ్డి, నార్కెట్ పల్లి తహసిల్దార్, తదితరు లు మంత్రి వెంట ఉన్నారు.