Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, ఫేక్ ఫోటో, వీడియో కరోనాను మించిన మహమ్మారిలాంటివి

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సి టీ (HCU) భూములను లాక్కున్న ట్లుగా సోషల్ మీడియా నెట్‌వర్క్ ద్వారా కృత్రిమంగా వివాదం సృ ష్టించటం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కంచె గచ్చిబౌలి భూములకు సంబంధిం చి కోర్టులో ఉన్న కేసులపై ముఖ్య మంత్రి ఎ.రే వంత్ రెడ్డి సచి వాల యంలో సమీక్ష నిర్వ హించారు.

అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసే ఫేక్ వీడియోలు (Fake Videos), ఫొటోలు (Fake Photos) కరోనా వైరస్‌ను మించిన మహమ్మారిలాంటివని ఈ సమా వే శం ఆందోళన వ్యక్తం చేసింది. స మాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్ కంటెంట్ తయారీపై విచారణ కు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టుకు విజ్ఞప్తి చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధి కారులను ఆదేశించారు.

కంచె గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25 లో ఉన్న భూముల్లో గత 25 ఏండ్లుగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మిం చారు. ఐఎస్‌బీతో పాటు గచ్చిబౌలి స్టేడియం, ఐఐఐటీ, ప్రైవేటు బిల్డిం గ్‌లు, రెసిడెన్షియల్ అపార్టుమెం ట్లు, హైదరాబాద్ యూనివర్సిటీ భవనాలను నిర్మించారు. వాటిని నిర్మించే సందర్భాల్లో ఎలాంటి వివా దాలు, ఆందోళనలు జరగలేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.

అప్పుడు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ విధ్వంసం లాంటి వివా దాలు కూడా లేవన్నారు. అలాంట ప్పుడు అదే సర్వే నెంబర్లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృ ద్ధి చేసేటప్పుడు ఎందుకు వివాదా స్పదమైందని అంశంపై సమావే శంలో చర్చ జరిగింది.

అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్న ట్లుగా వీడియోలు, ఫొటోలు సృష్టిం చి కొందరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటంతో ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిందని అధికారు లు వివరించారు.

వాస్తవాలు వెల్లడించే లోగా అబద్ధా లు సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో వైరల్ కావటం ప్రభుత్వా నికి సవాలుగా మారిందని అధికా రులు ముఖ్యమంత్రికి వివరించా రు. ఏకంగా నెమళ్లు ఏడ్చినట్లుగా ఆడియోలు, బుల్లోజర్లకు జింకలు గాయపడి పరుగులు తీస్తున్నట్లుగా ఫేక్ ఫొటోలు, వీడియోలు తయా రు చేశారని పోలీసు అధికారులు సమావేశంలో వివరించారు.

వివిధ రంగాల్లో పేరొందిన ప్రము ఖులు కూడా వాటినే నిజమని న మ్మి సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టడంతో అబద్ధాలకు ఆజ్యం పోసినట్లయిందని అన్నా రు. ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ధ్రువ్ రాఠీ, సినీ ప్రముఖులు జాన్ అబ్రహం, దియా మీర్జా, రవీనా ఠం డన్ లాంటి వారందరూ ఏఐ ద్వా రా సృష్టించిన ఫేక్ ఫొటోలు, వీడి యోల పోస్టు చేసి సమాజానికి త ప్పుడు సందేశం చేరవేశారన్న చర్చ సమావేశంలో జరిగింది.

ఈ భూములపై మొట్టమొదటగా ఫేక్ వీడియో పోస్ట్ చేసిన జర్నలిస్ట్ సుమిత్ ఝా కొద్ది సేపట్లోనే తన పోస్టును తొలిగించి క్షమాపణలు చె ప్పారని, కానీ మిగతా ప్రముఖులెవ రూ ఈ నిజాన్ని గుర్తించకుండా అ దే ఫేక్ వీడియో ప్రచారం చేశారని అధికారులు వివరించారు.

కంచె గచ్చిబౌలిలో ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాలు విసిరిందన్న అభిప్రా యం సమావేశంలో వ్యక్తమైంది. ఇ దే తరహాలో ఇండో పాక్, ఇండో చై నా సరిహద్దుల్లాంటి వివాదాలు, ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాల్లో ఏఐతో ఫేక్ కంటెంట్ సృ ష్టిస్తే భవిష్యత్తుల్లో యుద్ధాలు జరిగే పెను ప్రమాదముంటుందని చర్చ జరిగింది.

మరోసారి ఇలాంటి ఘటనలు పున రావృతం కాకుండా రాష్ట్రంలో సైబ ర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చే యాలని ముఖ్యమంత్రి ఆదేశిం చారు. ఏఐ ఫేక్ కంటెంట్‌ను గుర్తిం చడానికి అవసరమైన అధునాతన ఫోరెన్సిక్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ టూ ల్స్‌ను సమకూర్చుకోవాలని ము ఖ్యమంత్రి అధికారులకు సూచిం చారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్య మం త్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రు లు ధనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి శాంతికుమారి, డీజీపీ జి తేందర్, పీసీసీఎఫ్ ఆర్.ఎం. డోబ్రి యల్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.