Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Road Accident : అద్దంకి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

–ఒకరి మృతి.. పలువురికి గాయాలు

Road Accident : ప్రజాదీవెన నల్గొండ : నల్లగొండ పట్టణ సమీపంలోని అద్దంకి హైవేపై మంగళవారం రెండు కార్లు ఢీ కొన్న ఘటనలో పిదురు రఘు రాంమూర్తి (85) అనే వ్యక్తి మృతి చెందగా, పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి టూ టౌన్ ఎస్ఐ సైదులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు జిల్లా దాచేపల్లి కి చెందిన షేక్ ఫిరోజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్రా యాత్ర కోసం ఎర్టిగా కారులో హైదరాబాద్ కు వెళ్తుండగా నల్గొండ లోని లెప్రసీ కాలనీ సమీపంలో హైదరాబాదు నుండి వస్తున్న వ్యాగనార్ కారు డ్రైవర్ అతివేగంతో రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ను ఢీకొట్టడంతో ఆ కారు ఎగిరి ఎర్టిగా కారుపై పడడంతో వ్యాగనార్ కార్ లో ఉన్న డ్రైవర్ తో పాటు అతని తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా రఘు రాంమూర్తి చికిత్స పొందుతూ మరణించినట్లు టూ టౌన్ ఎస్ఐ సైదులు చెప్పారు. గాయపడ్డ వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు.