— సిపిఎం డిమాండ్
CPM Demand : ప్రజాదీవెన నల్గొండ : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సిపిఎం నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సుభాష్ విగ్రహం దగ్గర ప్లే కార్డులతో గ్యాస్ సిలిండర్ పక్కనపెట్టి కట్టెల పొయ్యి పై వంట చేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికే సామాన్యులకు ఉపాధి అవకాశాలు లేక వస్తున్న కొద్దిపాటి వేతనాలు ఏమాత్రం సరిపోక పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను భరించలేని ఈ పరిస్థితుల్లో గ్యాస్ కు 50 రూపాయలు పెంచి పేదలపై భారాలు మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
దేశ సంపదను కొల్లగొడుతున్న కార్పొరేటు శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కోట్లాది రూపాయలు బ్యాంకు రుణాలు మాఫీ చేస్తూ పేదలపై భారాలు మోపడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసి పెంచిన నిత్యవసర వస్తువుల ధరలను, గ్యాస్ పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ప్రజలందరితో కలిపి ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు యం డి. సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, మండల కార్యదర్శి నలపరాజు సైదులు, సీపీఎం నల్లగొండ పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, అద్దంకి నరసింహ, దండెంపల్లి సరోజ, కోట్ల అశోక్ రెడ్డి, గంజి నాగరాజు, గాదేనరసింహ, పాక లింగయ్య, గుండాల నరేష్, పాలాది కార్తీక్, సలివోజు సైదాచారి, భూతం అరుణ, మాజీ కౌన్సిలర్ అవుట రవీందర్, బొల్లు రవీంద్ర కుమార్, కునుకుంట్ల ఉమారాణి, సీత వెంకటయ్య, ఆవుల గిరి, కత్తుల యాదయ్య, జేరిపోతుల సైదులు తదితరులు పాల్గొన్నారు.