Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్య, ప్రతి ఇంటికి ఇంటర్నెట్, స్మార్ట్ టివి

Minister Sridhar Babu :ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లా ల్లోని ప్రతి ఇల్లు, కార్యాలయానికి తెలంగాణా ఫైబర్ నెట్ ద్వారా ఇం టర్నెట్ సేవలు కల్పించనున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి డీ. శ్రీధర్ బాబు వెల్లడించారు. బేగంపేటలో గురువారం టీ ఫైబర్ నూతన కా ర్యాలయాన్ని ప్రారంబించిన సం దర్బంగా ఆయన ప్రసంగించారు. కేబుల్ అపరేటర్ల సహకారంతో లాస్ట్ మైలు వరకు టివి ఛానెల్స్ సదుపాయాలు కూడా కల్పిస్తామని తెలిపారు.

టీవీ సెట్లను కంప్యూటరు మానిటర్ గా వినియోగించుకుని విద్యార్థులు ప్రయోజనం పొందేలా టెక్నాలజీ రూపొందించినట్టు శ్రీధర్ బాబు చెప్పారు. ‘టీ ఫైబర్ ఇప్పటికే 424 మండలాల్లోని 8,891 గ్రామ పంచా యతీలను అనుసంధానం చేసింది. మరో 7,187 పంచాయతీలు సేవ లు అందుకోవటానికి సిద్దంగా ఉ న్నాయి. ఈ సంవత్సరం 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు కనెక్టివి టీ కల్పించాం. 2027 నాటికి 60 వేల కార్యాలయాలను అనుసంధా నం చేస్తాం. టీ ఫైబర్ ఇకపై T-NxT పేరుతో సేవలు అందిస్తుంది. కార్య క్రమంలో వ్యాపార భాగస్వా ము లతో 9 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయన్నారు.

ఈ సంధర్భంగా శ్రీధర్ బాబు టీ ఫైబర్ కొత్త లోగోను ఆవిష్కరిం చారు. ‘తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన డేటాను సురక్షి తంగా ఉంచగల సావరిన్ క్లౌడ్ ను మంత్రి ప్రారంభించారు. కేవలం వైర్లను జత చేయటం కాదు. ప్రజ లను, వాళ్ళ ఆలోచనలను, అవకా శాలను కలుపుతున్నామని మంత్రి ప్రకటించారు. టీ ఫైబర్ కోసం కొత్త విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరిం చారు. తెలంగాణా ఫైబర్ గ్రిడ్ కా ర్పొరేషన్ ఛైర్మన్ గా శ్రీధర్ బాబు బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ డి ప్యూటీ సెక్రెటరీ భవేష్ మిశ్రా, టీ ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ పన్నేరు, పలువురు అధికారులు పాల్గొన్నా రు.