Nature Lover : ప్రజా దీవేన, కోదాడ: వనజీవి రామయ్య మరణం పట్ల స్థానిక తేజా టాలెంట్ స్కూల్ విద్యార్థులు, యాజమాన్యం శనివారం పాఠశాల ఆవరణలో సంతాపం తెలియజేస్తూ నివాళులు అర్పించారు అనంతరం పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ పకృతి ప్రేమికుడు పర్యావరణ రక్షకుడు వనజీవి రామయ్య వికమనకి లేరని ఆయన మరణం పకృతి ప్రేమికులకు తీరనిలోటు అని తెలిపారు.
కోటి మొక్కలు నాటి గిన్నిస్ బుక్ రికార్డు లోకి ఎక్కి 2017 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేత పద్మశ్రీ అవార్డుతో సత్కరించ బడ్డారని కొనియాడా రు. వనజీవి రామయ్య పేదరికంలో పుట్టినప్పటికీ, పర్యావరణం పట్ల అమితమైన ప్రేమతో తన కుటుంబం కన్నా ప్రకృతిని రక్షించడంతో పల్లెలు, పట్టణాలు తిరుగుతూ చెట్లను పెంచమని ప్రచారం చేశారు అలాంటి మహానుభావుడు రామయ్య. పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని తేజ విద్యార్థులు వినమ్రతతో అంజలి ఘటించారు.