Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tribute to Komati Reddy Pratik Reddy: కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కి ఘన నివాళి

--ప్రతీక్ రెడ్డి మెమోరియల్ కళాశాలలో వర్ధంతి కార్యక్రమాలు --వెల్లువలా తరలివచ్చి రక్తదానం చేసిన పార్టీ శ్రేణులు, అభిమానులు --విద్యార్థులకు నోటు పుస్తకాలు, పారిశుద్ధ్య సిబ్బందికి బట్టల పంపిణీ --పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి అల్లుడు ప్రణవ్ రెడ్డి

కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కి ఘన నివాళి

–ప్రతీక్ రెడ్డి మెమోరియల్ కళాశాలలో వర్ధంతి కార్యక్రమాలు
–వెల్లువలా తరలివచ్చి రక్తదానం చేసిన పార్టీ శ్రేణులు, అభిమానులు
–విద్యార్థులకు నోటు పుస్తకాలు, పారిశుద్ధ్య సిబ్బందికి బట్టల పంపిణీ
–పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి అల్లుడు ప్రణవ్ రెడ్డి

ప్రజా దీవెన/నల్లగొండ: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనయుడు ప్రతీక్ రెడ్డి 12వ వర్ధంతి ని బుధవారం నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి నివాసం తో పాటు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ జూ నియర్ కళాశాలలో రక్తదానం నిర్వహించారు. కళాశాల లో నూత నంగా నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్ ను ఎంజియూ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు, పోటీ పరీక్షలకు సంబంధించి మెటీరియల్ ప్రతి ఫౌండేషన్ చైర్మన్ గోన రెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేశారు. కళాశాలలో నిర్వహించిన ఉచిత రక్తదాన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు వెల్లువలా తరలివచ్చారు.

నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డితో పాటు పలువురు కౌన్సిలర్లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు రక్తదానం చేశారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.అదేవిధంగా మరియమాత చర్చిలో ప్రతిక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనాధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.

ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాలలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అల్లుడు ప్రణవ్ రెడ్డి, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, ప్రతి ఫౌండేషన్ చైర్మన్ ఎం.వి. గోనా రెడ్డి, నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీ మనిమద్ది సుమన్, తిప్పతీ జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూకూరి రమేష్, కనగల్ మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ ఏ సి హెచ్ పుల్లారావు, డాక్టర్ ఎన్సీ రాములు, కౌన్సిలర్లు జూలకంటి శ్రీనివాస్, కరుణాకర్ రెడ్డి, ఇంతియాజ్, సమీర్, బొజ్జ శంకర్, బాబా, బోగరి ఆనంద్, బుర్రి రజిత యాదయ్య, ఇబ్రహీం, నవీన్ కుమార్, గడిగ హిమబిందు శ్రీనివాస్, ఖయ్యూం బేగ్, చిన్నాల అలివేలు జానయ్య, ప్రదీప్ నాయక్, కాంగ్రెస్ నాయకులు ఇంతియాజ్ హుస్సేన్, మందడి శ్రీనివాస్ రెడ్డి, ఇంతియాజ్, కంచి మధుసూదన్, బాబా, ఇటికాల శ్రీనివాస్, వంగాల అనిల్ రెడ్డి, దుబ్బ అశోక్ సుందర్, జూలకంటి సైదిరెడ్డి, గాలి నాగరాజు, ఏదుల్ల శ్రీధర్ రెడ్డి,మామిడి కార్తీక్, గోలి రవి, పిల్లి రమేష్ యాదవ్, ఇబ్రహీం, అఫ్జల్ ఖాన్ , పున్న పవన్ కుమార్, పల్ రెడ్డి వెంకట్ రెడ్డి, గుండగోని శ్రీనివాస్ గౌడ్, రాజు, ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.