–నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Nalgonda District Collector Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాం గం వల్లనే సమాజంలో ప్రతి ఒక్క రూ హక్కులు, బాధ్యత లను, పద వులను పొందగలుగు తున్నారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నా రు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134 వ జయం తిని పురస్కరించు కొని సోమవా రం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళు లర్పిం చారు.
అనంతరం డిఈఓ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన సమా వేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ భారత రాజ్యాంగ డ్రాప్టింగ్ క మిటీ అధ్యక్షుడిగా ఉంటూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రూపొందించిన ఆర్టికల్స్ వల్లనే తా ను ఐఏఎస్ కాగలిగానని, అదేవి ధంగా భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీ ఎస్ కావాలనుకునే విద్యార్థులకు ఆయన రాజ్యాంగమే స్ఫూర్తి ఆని అన్నారు.
సమాన విద్య , సమానత్వ హక్కు లు, ప్రాథమిక హక్కులన్నీ అంబే ద్కర్ రాజ్యాంగంలో రాసినవే అని తెలిపారు. దేశంలో, ప్రపంచంలో ఎటువైపు చూసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మార్కు కనిపిస్తుంద న్నారు. ఎలాంటి పక్షపాతం లేకుం డా డ్రాప్టింగ్ కమిటీని రూపొందిం చడమే కాకుండా, ప్రాథమిక హక్కు లు, సూత్రాలను రాజ్యాంగంలో ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని 1950, జనవరి 26 నుండి పూర్ణ రూపుకు తీసుకువచ్చారని అన్నా రు .
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి పోర్టల్ ను ఈరోజు నుండే అమలులోకి తీసుకురానుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఈ రోజే భూభారతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని, ఈరోజు చరిత్ర లో నిలిచిపోయే రోజని అన్నారు. మూఢనమ్మకాలను పక్కనపెట్టి, ప్ర తి మాటకు శాస్త్రీయత ఉండే వి ధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారని, దాని ప్రకారమే మనందరం ముం దుకెళ్తున్నామని అన్నారు.
విద్యార్థులు శ్రద్ధతో చదివి ,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను స్పూర్తిగా తీసుకొని వారి ఆశయ సాధన కృషి చేయాల న్నారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ చదువును ఆయు ధంగా తీసుకొని సామాజిక మార్పు ను తీసుకొచ్చిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అ న్నారు. ఇతర దేశాలకు వెళ్లి చదు వుకొని విజ్ఞానాన్ని సంపాదించి మ న దేశ పరిస్థితులను అధిగమించి ఎలా ముందుకు వెళ్లాలో కూడా డా క్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆనాడే రా జ్యాంగంలో పొందుపరిచారన్నారు.
సమానత్వం, సామాజిక న్యాయం తో పాటు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, ఆయన విలువ ల ఆధారంగానే మనం ముందుకు వెళ్తున్నామని అన్నారు.
శాసన మండలి సభ్యులు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం హక్కులు, చట్టాలను రూపొందించి భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు డా క్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నా రు. నిమ్న కులం లో పుట్టి ఎన్నో అవమానాలకు గురై ,చదువు నే ర్చుకుని ప్రపంచ మేధావిగా నిల బడ్డారన్నారు. ప్రపంచంలోనే అనేక రాజ్యాంగాలను చదివి దేశ రా జ్యాంగాన్ని రచించారని, ఎస్సీ, ఎస్టీ ,బీసీ హక్కులను రూపొందిం చడం కోసం ఆయన ఎంతో కృషి చేశారన్నారు.
అలాంటి ప్రపంచ మేధావి మన దేశంలో పుట్టడం అందరికీ గర్వ కారణమని, డాక్టర్ బి.ఆర్ అంబే ద్కర్ స్పూర్తిగా సమానత్వం కోసం ప్రజాతంత్ర శక్తులందరూ కలిసికట్టు గా కృషి చేయాల్సిన అవసరం ఉం దని అని పిలుపునిచ్చారు.
అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ రమేష్, ఇన్చార్జి సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్, జెడ్పిసిఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్ , బీసీ సంఘ నా యకులు చక్రహరి రామరాజు, ఇ తర నాయకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు పూలమా లలు వేసి నివాళులర్పించి మా ట్లాడారు .
ఈ కార్యక్రమానికి జిల్లా అధికారు లు, ప్రజాప్రతినిధులు ,వివిధ సం ఘాల ప్రతినిధులు హాజరయ్యారు.