Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chief Minister A Revanth Reddy : భూ భార‌తిపై క్షేత్ర స్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించాలి

–ప్ర‌తి మండ‌ల స‌ద‌స్సుకు క‌లెక్ట‌ర్లు హాజ‌రుకావాలి
–ఇందిర‌మ్మ ఇళ్ల జాబితాకు ఇన్‌ ఛార్జి మంత్రుల ఆమోదం ఉండాలి
–వేస‌విలో తాగునీటి స‌మ‌స్య రా కుండా పక్కాప్ర‌ణాళిక‌లు ఉండాలి –జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు ముఖ్య‌మంత్రి ఏ రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

Chief Minister A Revanth Reddy :ప్రజా దీవెన, హైద‌రాబాద్‌: రైతుల భూ స‌మ‌స్య‌ల శాశ్వ‌త ప‌రిష్కార‌ మే ధ్యేయంగా ఎంతో అధ్య‌య‌నం తో తీసుకువ‌చ్చిన భూ భార‌తి చ‌ ట్టాన్ని క్షేత్ర స్థాయికి స‌మర్థంగా తీ సుకెళ్లాల‌ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు ము ఖ్య‌మంత్రి ఏ. రేవంత్ రెడ్డి సూచిం చారు. ఇందుకు ప్ర‌తి మండ‌లంలో స‌ద‌స్సు నిర్వ‌హించాల‌ని, ప్ర‌తి క‌లె క్ట‌ర్ మండ‌ల స్థాయి స‌ద‌స్సుల‌కు హాజ‌రై అక్క‌డ రైతులు, ప్ర‌జ‌లు లే వ‌నెత్తే సందేహాల‌కు వారికి అర్ధ‌ మ‌ య్యే భాష‌లో వివ‌రించి ప‌రిష్కా రం చూపాల‌న్నారు. హైద‌రాబాద్‌ లోని మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌ రుల అభివృద్ధి సంస్థలో (ఎంసీ హె చ్ఆర్‌డీ) సోమ‌వారం నిర్వ‌హిం చి న స‌మావేశంలో భూభార‌తి, ఇంది ర‌మ్మ ఇళ్లు, వేస‌వి తాగునీటి ప్ర‌ణా ళిక‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జి ల్లాల క‌లెక్ట‌ర్ల‌కు దిశానిర్దేశం చేశారు.

భూ భార‌తి, ఇందిర‌మ్మ ఇళ్ల‌ను తాము ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కం గా తీ సుకున్నామ‌ని, ఈ రెండింటిని క్షేత్ర స్థాయికి తీసుకెళ్ల‌డంలో క‌లెక్ట‌ర్లు ప్ర‌ త్యేక శ్ర‌ద్ధ చూపాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. భూ భార‌తి చ‌ ట్టాన్ని క‌లెక్ట‌ర్లు స‌మ‌గ్రంగా అ ధ్య‌ య‌నం చేయాల‌ని సీఎం అన్నారు. గ‌తంలో రెవెన్యూ స‌మ‌ స్య‌ల ప‌రి ష్కారాన్ని ప‌ట్టించుకోకుండా రైతు ల‌ను న్యాయ‌స్థానాల‌కు పంపార‌ని, భూభార‌తి చ‌ట్టంలో రెవెన్యూ యం త్రాగ‌మే ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కా రానికి కృషి చేస్తుంద‌ని అప్పీల్ వ్య‌ వ‌స్థ ఉన్న విష‌యాన్ని రైతులు, ప్ర‌ జ‌ల‌కు వెల్ల‌డించాల‌ని సీఎం తెలిపా రు. భూ భార‌తి పైలెట్ ప్రాజెక్టు స‌ ద‌స్సుల‌ను నారాయ‌ణ‌పేట జిల్లా మ‌ద్దూర్‌, ఖ‌మ్మం జిల్లా నేల‌కొండ‌ ప‌ల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట‌, ములుగు జిల్లా వెంక‌టాపూర్ మం డ‌లాల్లో నిర్వ‌హిస్తార‌ని, ఆయా మండ‌ల కేంద్రాల్లో స‌ద‌స్సుల‌కు క‌లెక్ట‌ర్లు క‌చ్చితంగా హాజ‌రుకావా ల‌ని, ఆయా మండ‌లాల్లో ప్ర‌తి గ్రా మంలో రెవెన్యూ సిబ్బందితో స‌ద‌ స్సులు నిర్వ‌హించాల‌ని సీఎం రే వంత్ రెడ్డి ఆదేశించారు. ఆయా స‌ద‌స్సుల‌కు రెవెన్యూ మంత్రి పొం గులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి, ఇత‌ర మం త్రులు హాజ‌రువుతార‌ని సీఎం తెలిపారు.

ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికో ప్ర‌త్యే కాధికారి…. ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మా ణాన్ని త‌మ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌ కంగా తీసుకుంద‌ని ముఖ్య‌మంత్రి ఏరేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామ స్థా యిలో ఇందిర‌మ్మ ఇళ్ల క‌మిటీలు ఆమోదం పొందిన జాబితాను మం డ‌ల స్థాయి క‌మిటీలు ప‌రిశీలించా ల‌ని సీఎం సూచించారు. ఆ క‌మిటీ ల ప‌రిశీల‌న అనంత‌రం జిల్లా ఇన్‌ ఛార్జి మంత్రికి పంపాల‌ని, జిల్లా ఇ న్‌ఛార్జి మంత్రి ఆమోదించాకే ఇళ్ల జాబితా ఖ‌రార‌వుతుంద‌ని ముఖ్య‌ మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఈ వ్య‌వ‌హారం స‌క్ర‌మ ప‌ర్య‌వేక్ష‌ణ‌ కు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి ప్ర‌త్యేక అధికారిని నియ‌మించాల‌ని ము ఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారిని ఆదేశించారు.

ఈ ప్ర‌త్యేకాధికారి ఇందిర‌మ్మ క‌మి టీలు, మండ‌ల క‌మిటీలు, క‌లెక్ట‌ర్లు, ఇన్‌ఛార్జి మంత్రి మ‌ధ్య స‌మ‌న్వ‌య‌ క‌ర్త‌గా ఉంటార‌ని సీఎం తెలిపారు. గ‌తంలో ఉమ్మ‌డి జిల్లాకు నియ‌మిం చిన సీనియ‌ర్ అధికారులు ఇందిర‌ మ్మ ఇళ్ల నిర్మాణాల‌పై దృష్టి సారిం చాల‌ని, ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని సీఎం సూ చించారు. ఇళ్ల మంజూరులో ఏ ద‌శ‌లోనూ ఎవ‌రూ ఎటువంటి ఒ త్తిళ్ల‌కు త‌లొగొద్ద‌ని, ఎక్క‌డైనా అన‌ ర్హుల‌కు ఇళ్లు కేటాయిస్తే మండ‌ల స్థాయి క‌మిటీ, ప్ర‌త్యేకాధికారిపై చ‌ ర్య‌లు ఉంటాయ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హెచ్చ‌రించారు.

ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణానికి సం బంధించి ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి 3,500 ఇళ్లు కేటాయించినందున జ‌నాభా ప్రాతిప‌దిక‌న‌, ఆయా గ్రా మాలకు ఇళ్ల కేటాయింపు ఉండా ల‌ని, ఈ విష‌యంలో హేతుబ‌ద్ధ‌త పాటించాల‌ని సీఎం సూచించారు. నిర్దేశిత స‌మ‌యం ఆధారంగా ఇళ్ల నిర్మాణాలు సాగించాల‌ని, ఇందుకు క‌లెక్ట‌ర్లు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపాల‌ని సీ ఎం ఆదేశించారు.

తాగు నీటి స‌మ‌స్య తలెత్త వద్దు …వేస‌వి కాలంలో ఎక్క‌డా తాగు నీటి స‌మ‌స్య త‌లెత్త‌కుండా క‌ లెక్ట‌ర్లు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపాల‌ని ము ఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి సూచిం చారు. తాగు నీటి స‌ర‌ఫ‌రా విష‌ యంలో నీటి పారుద‌ల శాఖ‌, తాగు నీటి స‌ర‌ఫ‌రా శాఖ‌, విద్యుత్ శాఖ స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని ముఖ్యమంత్రి అన్నారు. క‌లెక్ట‌ర్లు సైతం డ్యాష్ బోర్డు ద్వారా ప్ర‌తి గ్రామంలో తాగు నీటి వ‌న‌రులు, స‌ర‌ఫ‌రాపై ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని సూచించారు. ఎక్క‌డైనా స‌మ‌స్య త‌లెత్తితే ఎలా ప‌రిష్క‌రించాల‌నే దానిపై ప్ర‌త్యామ్నాయ ప్ర‌ణాళిక ఉండాల‌ని సీఎం అన్నారు.

ప‌లు గ్రామాల‌కు తాగు నీటి స‌ర‌ ఫ‌రా పైపులైను వ్య‌వ‌స్థ లేద‌ని, ప‌ లు ఇళ్ల‌కు న‌ల్లాలు లేవ‌ని ఆయా ప్రాంతాల్లోనూ తాగు నీటి స‌మ‌స్య రాకుండా చూడాల‌ని సీఎం అన్నా రు. కోయ గూడేలు, చెంచు పెంట‌ లు, ఇత‌ర గిరిజ‌న ప్రాంతాల‌పై ప్ర‌ త్యేక శ్ర‌ద్ద పెట్టాల‌ని సీఎం క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. తాగు నీటి స‌ర‌ఫ‌రా పైపులైన్లు, మోటార్ల మ‌ర‌మ్మ‌తు లు, బోర్ల రిపేర్ల‌కు సంబంధించి క‌లె క్ట‌ర్లకు ఇప్ప‌టికే నిధులు కేటా యిం చామ‌ని, అవ‌స‌ర‌మైతే మ‌రిన్ని ని ధులు కేటాయిస్తామ‌ని సీఎం తెలి పారు. హైద‌రాబాద్‌తో పాటు ఇత‌ర కార్పొరేష‌న్లు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో తా గు నీటి స‌ర‌ఫ‌రా మోటార్లు కాలిపో యిన‌ప్పుడు, లేదా ఇత‌ర సాంకేతిక స‌మ‌స్య‌లు తలెత్తిన‌ప్పుడు క‌లెక్ట‌ర్లు వెంట‌నే సీఎస్‌కు స‌మాచారం అంద‌ జేయాల‌ని, వాటిని యుద్ధ ప్రాతిప‌ దిక‌న ప‌రిష్క‌రించే ఏర్పాట్లు చేయా ల‌ని సీఎస్‌ను ముఖ్య‌మంత్రి రేవం త్ రెడ్డి ఆదేశించారు.

ఈ స‌మావేశంలో ఉప ముఖ్య‌ మం త్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రు లు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, పొంగు లేటి శ్రీ‌నివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌ బాబు, కొండా సురేఖ‌, పొన్నం ప్ర‌భా క‌ర్, జూప‌ల్లి కృష్ణారావు, దామోద‌ ర రాజ‌న‌ర్సింహ‌, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కేశ‌వ‌రావు, ష‌బ్బీర్ అలీ, ఆయా శాఖ‌ల ఉన్న‌ తాధికారులు, జిల్లాల క‌లెక్ట‌ర్లు పాల్గొన్నారు.