Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Hanmakonda news ఘోర రోడ్డుప్రమాదం… నలుగురు దుర్మరణం

--దైవదర్శనానికి వెళ్తున్న సమయంలో ప్రమాదం --ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృత్యువాత

ఘోర రోడ్డుప్రమాదం… నలుగురు దుర్మరణం

–దైవదర్శనానికి వెళ్తున్న సమయంలో ప్రమాదం
–ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృత్యువాత

ప్రజాదీవెన/హన్మకొండ: హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. కారును లారీ ఢీకొనగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన కాంతయ్య, శంకర్, భరత్, చందనగా పోలీసులు గుర్తించారు.

ఎల్కతుర్తి మండలం పెంచికల పేట దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మృతు లంతా ఏటూరు నాగారం వాసులు గా పోలీసులు గుర్తించారు. వేము లవాడ దర్శనానికి వెళ్తుండ గా ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు, జేసీబీ సాయంతో కారులో ఇరుక్కుపో యిన వారిని అతికష్టంమీద బయటకు తీశారు.

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారంతా ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రానికి చెందినవారని, వేములవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి మంచు ఎక్కువ ఉండటంతో దీంతో అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

మృతులు మంతెన కాంతయ్య (72), మంతెన శంకర్(60), మంతెన భారత్ (29), మంతెన చందన(16). గాయపడ్డ మంతెన రేణుక, భార్గవ్, శ్రీదేవిలను చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృత దేహాలు ఎంజీఎం మార్చురీకి తరలించి పోస్టుమార్టం   నిర్వహిస్తున్నారు.