Supreme Court :ప్రజా దీవెన, న్యూఢిల్లీ : వేదాలు, రామాయణం, మహాభారతం వం టి ఇతిహాసాలలో ఉన్న న్యాయత త్వాన్ని లా కాలేజీలు, విశ్వవిద్యా లయాలు పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీం కోర్టు (Supreme Court) న్యాయ మూర్తి జస్టిస్ పంకజ్ మిట్టల్ వ్యా ఖ్యానించారు. న్యాయం, సమాన త్వం భావనలను విద్యార్థులకు పా శ్చాత్య దేశాల నుంచి తెచ్చుకున్న విషయాలుగా కాకుండా భారతదేశ ప్రాచీన చట్టపరమైన తార్కిక విధా నాలలో పొందుపరిచిన ఆలోచన లుగా బోధించాలని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు 75 వసంతాలను పుర స్కరించుకుని ఏప్రిల్ 12న భోపాల్ లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నిర్వహించిన సమా వేశంలో పంకజ్ మిట్టల్ పలు అం శాలు ప్రస్తావించారు.
వేదాలు, ఇతిహాస గాథలు విం టే కొత్త విషయాలు… పురాతన భారతీయ చట్టపరమైన, తాత్విక సంప్రదాయాలను లా కాలేజీలు పాఠ్యాంశాల్లో అధికారికంగా చేర్చా ల్సిన సమయం ఆసన్నమైంది. వే దాలు, స్మృతులు, మనుస్మృతి, ధ ర్మాలు, అర్థశాస్త్రం, మహాభారతం, రామాయణం లాంటి ఇతిహాసాలు కేవలం సాంస్కృతిక కళాఖండాలు కాదు. వాటిలో న్యాయం, సమాన త్వం, శిక్షలు, పరిపాలన, రాజీ కు దుర్చడం, నైతికత లాంటి లోతైన విషయాలను ప్రతిబింబిస్తున్నాయి. వాటిని తెలుసుకోవాలనుకుంటే ముందుగా చదవాలన్నారు.
సుప్రీంకోర్టు తీర్పులను ప్రాంతీయ భాషలలో అందుబాటులోకి తీసు కువస్తే దేశ న్యాయ వ్యవస్థను బా గా అర్థమవుతుంది. అందుకు ప్ర యత్నాలు జరుగుతున్నాయని జడ్జి మిట్టల్ అన్నారు. భారత మా జీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలో కొం తకాలం కిందట చీర ధరించి, కత్తికి బదులుగా పుస్తకం పట్టుకుని, కళ్ల కు గంతలు తొలగించి ఉన్న న్యా యదేవత కొత్త విగ్రహాన్ని ఆవిష్క రించారు.
న్యాయం కోసం 4 పుస్తకాలు
ఆ పుస్తకం రాజ్యాంగం అని, కానీ నాలుగు పుస్తకాలు ఉండాలని తాను నమ్ముతున్నానని జస్టిస్ మిట్టల్ అన్నారు. రాజ్యాంగంతో పాటు ప్రజలకు భగవద్గీత, వేదా లు, పురాణాలు లాంటి పుస్తకాలు ఉండాలి. దాంతో న్యాయవ్యవస్థ ద్వారా అందరికీ మేలు జరుగు తుంది. లా కాలేజీలు, యూనివర్సి టీలు ధర్మం – భారతీయ న్యాయ ఆలోచన, లేదా భారతీయ న్యాయ శాస్త్ర మూలాలు అనే శీర్షిక ఉండా లని ఆయన ప్రతిపాదించారు. దాం తో విద్యార్థులకు సాంస్కృతిక, మే ధోపరమైన పునాదిని ఆ పాఠ్యాం శాల ద్వారా పటిష్టం అవుతాయి.
ఆర్టికల్ 14ను సమానత్వం కోసం అరువు తెచ్చుకున్న విషయంగా కాకుండా సమానత్వం స్వరూపం గా అర్థం చేసుకోవాలి. పర్యావరణ చట్టాన్ని చట్టాల ద్వారా మాత్రమే కాకుండా వేదాలలో ప్రకృతిని గౌర వించారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాన్ని (ADR) శాస్త్రాలు, మనుస్మృతిలో ఉన్న విషయాల కొ నసాగింపుగా అర్థం చేసుకుంటా రు. రాజ్యాంగం అంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న సూత్రా లు, అంశాలు కాదు అని భారత్లో పురాతన కాలంలో పాటించిన న్యా య విధానాలుగా అర్థం చేసుకోవా ఈ లన్నారు. చట్టాలు కొన్నేళ్ల కింద ట, 1950లో పుట్టినవి కాదు, మన దేశంలో రామాయణం, మహా భార తం కాలంలోనే న్యాయ విధానాలు ఉన్నాయి.
వేదాలలో రాజ్యాంగ సూత్రాలు న్నాయి.. సుప్రీంకోర్టు పేర్కొనే ధర్మం ఉన్న చోట విజయం తధ్య మని అనేది మహాభారతం నుంచి తీసుకున్నారు. మన నాగరికతలో న్యాయం అనేది ధర్మం యొక్క స్వ రూపం. నైతికత, సామాజిక బాధ్య త, అధికారాన్ని సరిగ్గా వినియోగిం చడం మూల సూత్రాలు. పర్యావర ణ పరిరక్షణకు సుప్రీంకోర్టు జారీ చే సిన తీర్పులను ప్రస్తావించారు. అ ధర్వణవేదం మానవాళిని ఆకాశం, భూమి, గాలి, నీళ్లు, అడవికి హాని కలిగించవద్దని సూచించిందని జడ్జి మిట్టల్ అన్నారు. సమానత్వ సూ త్రాన్ని ప్రస్తావిస్తూ ఋగ్వేదంలో ఉం దన్నారు. అందరూ ఒకే మార్గంలో నడుస్తుంటే హెచ్చుతగ్గులు ఉండవ ని పేర్కొన్నారు. ధర్మం, నీతి, న్యా యాలకు పురాణ ఇతిహాసాలు మా ర్గదర్శకాలుగా నిలుస్తాయని పేర్కొ న్నారు.