Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

C.H.C. Lakshminarayana : కార్మికులకిచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి

–సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహె చ్ లక్ష్మీనారాయణ

C.H.C. Lakshminarayana :ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేత నాలు, పర్మినెంట్ ఇతర పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించా లని లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామ ని సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన పాక లక్ష్మీనారాయణ పిలుపుని చ్చారు. బుధవారం గ్రామపంచా యతీ కార్మికుల సమస్యల పరి ష్కారం కోసం కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించారు. అనం తరం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీని వాస్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్యకు వినతి పత్రాలు అం దజేశారు. అనంతరం కలెక్టరేట్ ధ ర్నాను ఉద్దేశించి ఆయన మాట్లా డుతూ రాష్ట్రంలో గ్రామపంచా య తీలలో పారిశుద్ధ్యం మంచినీటి స రఫరా వీధిలైట్ల నిర్వహణ పన్నుల వసులు తదితర పనులు నిర్వహి స్తు ప్రజలకు అనేక సేవలు అంది స్తున్న గ్రామపంచాయతీకార్మికుల పట్ల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో కొస్తే గ్రామపంచాయతీ కార్మికుల కనీస వేతనాలు పెంచుతామని, అర్హత కలిగిన వారిని పర్మనెంట్ చే స్తామని హామీ ఇచ్చారని ఇంతవ రకు ఏ ఒక్క సమస్య పరిష్కరించ లేదని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా కష్టాలు పోతాయని ఆశపడ్డ కార్మికులకు నిరాశ మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వానికి గ్రామపంచాయతీ కార్మికుల పైన ఏమాత్రం ప్రేమ ఉన్న వెంటనే కనీస వేతనం అమలు చేయాలని డి మాండ్ చేశారు.కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పుగా ఉన్న మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనాలు చెల్లించాలని అ ర్హత కలిగిన కార్మికులను పర్మినెంట్ చేయాలని, ప్రమాద బీమా 10 లక్ష లు చెల్లించాలని,బిల్ కలెక్టర్ కారో బార్లకు ప్రత్యేక హోదా కల్పించా లని కోరారు.

నల్గొండ జిల్లాలో గతంలో ఇచ్చిన సర్కులర్లను అమలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారని ఆరోపించారు.పోస్టల్ బీ మా ఆదివారం సెలవు ఎనిమిది గంటల పని బట్టలు చెప్పులు నూ నెలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.మల్టీ పర్పస్ పేరుతో కార్మి కులను వేధించడం ఆపాలని, ఎం డలు తీవ్రంగా ఉన్నందున ఒక్క పూట పనులే కార్మికులతో చేయిం చాలని, ఆన్లైన్లో లేని కార్మికుల పేర్లు వెంటనే నమోదు చేయాలని కోరా రు.ఈ సమస్యలపై ప్రభుత్వం స్పం దించకపోతే నిరవధిక సమ్మెకు సి ద్ధమవుతామని హెచ్చరించారు.

ఈ ధర్నా కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా సహాయ కార్యదర్శి చింతపల్లి బయన్న, పొన్న అంజ య్య, పిసర్వయ్య, ఎర్ర అరుణ, నరసయ్య, జానయ్య, రామలింగ య్య, ఎండి జహీర్ పి చంద్రయ్య, సైదులు,మరియమ్మ, రమేష్ , ఎల్ల య్య తదితరులు పాల్గొన్నారు.