Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SP Sharat Chandra Pawar : వీడిన నల్లగొండ మర్డర్ కేసు మిస్టరీ

— కన్నకూతురి కోసమే సుపారీ హత్య
–కేసులో నలుగురి నిందితుల అరెస్టు
–వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్

SP Sharat Chandra Pawar :ప్రజా దీవెన నల్లగొండ క్రైమ్: నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గీతాంజిలి అపార్ట్మెంట్ లో ని మణికంఠ కలర్ ల్యాబ్ ఓనర్ గద్దపాటి సురేశ్ హత్య కేసులో న లుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం సాయంత్రం ఏ ర్పాటు చేసిన మీడియా సమావే శంలో వివరాలు వెల్లడించారు.

రిటై ర్డ్ ఎక్సైజ్ సీఐ మాతరి వెంక టయ్య తన కుమార్తె గద్దపాటి ఉ మామహే శ్వరిని నకిరేకల్ పట్ట ణానికి చెందిన గద్దపాటి నరేష్ అనే యువకుడితో 2017లో వివాహం చేశాడు. కొన్నాళ్లవరకు సంసారం సజావుగా సాగినా, నరేష్ మరొక స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టు కుని తన భార్యను దూరంగా ఉంచ డంతో ఆమెను శారీరకంగా మాన సికంగా హింసకు గురిచేస్తున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య వివాదా లు మొదలై కోర్టులో కేసు నడు స్తోంది.

ఈ విషయానికి కారణం గద్దపాటి నరేష్ అన్న అయిన సురేష్ కార ణమని కక్ష పెంచుకున్నాడు. సు రేష్ కూడా మరొక స్త్రీతో చాలా కా లం నుంచి సాన్నిహిత్యంగా ఉం టూ తన భార్యకు దూరంగా ఉం టున్నాడు. అతడు తన తమ్ముడు నరేశ్ కూడా వివాహేతర సంబంధం కొనసాగించేందుకు ప్రోత్సహిస్తున్నా డని, అతడిని ఏ విధంగానైనా హతమార్చాలని ప్రణాళిక వేసుకున్నాడు.

సురేష్ ను చంపేస్తే తన అల్లుడు నరేష్ తన భార్యతో మంచిగా ఉం టాడన్న దురాలోచనతో పథకం ప్రకారము హైదరాబాదులోని కొత్తపేటకు చెందిన “ స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీ” కి చెందిన చిక్కు కిరణ్ కుమార్‌ అలియాస్ సీకే కుమార్ ను సంప్రదించాడు. అతని ద్వార నిఘా పెట్టించాడు.

దర్యాప్తులో నరేష్ మరో మహిళ తో సహజీవనం చేస్తూ ఒక పాపకు జన్మనిచ్చాడని సీకే కేమా్ రిపోర్ట్ ఇచ్చాడు. ఈ తతంగానికి సురేషే ప్రోత్సాహకుడేనని నమ్మిన వెంకట య్య, అతడి కుమార్తె ఉమా మ హేశ్వరి ఇద్దరు బలంగా నిర్ణయిం చుకుని హత్య చేయించాలని నిర్ణ యించారు. ఈ విషయంలో ఇరు వురూ కిరణ్ కుమార్ కు చెప్పగా అంధుకు తాను తాను గతంలో నేవీలో కమ్యూనికేషన్ వింగ్ లో పని చేసినానని, ఆధారాలు దొర క్కుండా హత్య ఏ విధంగా చేయా లో తెలుసని వెంకటయ్యకు చె ప్పారు.

దీంతో అంతా కుమ్మక్కై ముషం జగదీష్‌ను అనే వ్యక్తికి రూ.15లక్ష లు ఇచ్చి రెక్కి నిర్వహించాలని కో రారు. అనుకున్న ప్రకారం ముందు గా రూ.2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చా రు. ఈ పథకంలో భాగంగా, చిక్కు కిరణ్ కుమార్ జగదీష్ కు మరో రూ.3లక్షలు ఇస్తానని ఆశచూపిం చాడు. దీంతో నెల రోజుల నుంచి నల్లగొండలో తిరుగుతూ గద్దపాటి సురేశ్ కదలికలపై రెక్కినిర్వహిం చారు.

పక్కా పథకం ప్రకారమే..
ఈ నెల 11న సాయంత్రం కిరణ్ కుమార్ హైదరాబాద్‌లో హత్యకు కావాల్సిన చాకులు, మాస్కులు, టోపీలు, గ్లౌస్ లు సిద్ధం చేసుకుని కారులో బయలుదేరారు. నల్లగొం డకు వచే మార్గ మధ్యలో చెరువు గట్టు సమీపంలో, అప్పటికే వేచి చూ స్తున్న జగదీష్‌తో కలిసిన తర్వాత, వారు ఇద్దరూ రాత్రి 10:20 గంటలకు నల్లగొండ రా మగిరి సెంటర్ లో గల మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ వద్దకు చేరు కున్నారు. సురేష్ షాపు వద్దకు వ చ్చి తమకు ఫొటోలు ప్రింట్ కావాల ని అడుగగా, రాత్రి అయిందని, రేపు ఉదయం రమ్మని అన్నాడు. అర్జెంట్ గా కావాలని కోరగా, సురే ష్ ప్రింట్ వేయడానికి ఒప్పుకు న్నా డు. పనిలో నిమగ్నం అయ్యి ఉం డగా అదే ఆదునుగా భావించి అత నిపై కత్తులతో దాడి చేసి గొంతు కో సి, వీపు భాగంలో, కడుపులో విచ క్షణా రహితంగా పొడిచి దారుణం గా హత్య చేశారు. హత్య అనంత రం వారు బైక్ పై చెరువుగట్టుకు వెళ్లి రక్తం అంటిన దుస్తులు, కత్తు లు కారులో పెట్టుకుని ముసి వాగు సమీపంలో చెట్ల పొదలలో విసిరి, హైదరాబాద్ పారిపోయారు. నేర స్తులను బుధవారం అరెస్టు చేసి కోర్ట్ లో హాజరు పరచి, అటునుం చి రిమాండ్ కు తరలించినట్లు తెలి పారు.

నిందితులనుంచి మారుతి జెన్ కారు, రెండు బైకులు, 6 సెల్ ఫోన్ల ను స్వాధీనం చేసుకున్నారు. కేసు ను నల్లగొండ డీఎస్పీ కే.శివరాం రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ టూ టౌన్ సీఐ రాఘవరావు, శాలిగౌరా రం సీఐ కొండల్ రెడ్డి, నల్లగొండ 1 టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు వై.సైదులు, నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు, విష్ణు మూర్తి, సాయిప్రశాంత్ నాలుగు బృందాలుగా ఏర్పడి కేసును చేధిం చడంతో వారిని ఎస్పీ అభినం దించినారు.