Passage 2024: నేర బిల్లుల ఆమోదం…శిక్షలు మరింత కఠినం
--ముప్పైమూడు నేరాల్లో జైలుశిక్ష పెంపు- -ఎనభైమూడు నేరాల్లో జరిమానా పెంపు --హత్యానేరం సెక్షన్గా ఇకపై 101 పరిగణ --దేశ వ్యాప్తంగా జీరో ఎఫ్ఐఆర్ నమోదుకు శ్రీకారం --ఇకపై మూక హింసలకు మరణ దండన విధింపు --నేర జాబితా నుంచి ఆత్మహత్యాయత్నం తొలగింపు --చట్టాల మార్పుతో సత్వర న్యాయానికి సమయ నిర్దేశం
నేర బిల్లుల ఆమోదం…శిక్షలు మరింత కఠినం
–ముప్పైమూడు నేరాల్లో జైలుశిక్ష పెంపు-
-ఎనభైమూడు నేరాల్లో జరిమానా పెంపు
–హత్యానేరం సెక్షన్గా ఇకపై 101 పరిగణ
–దేశ వ్యాప్తంగా జీరో ఎఫ్ఐఆర్ నమోదుకు శ్రీకారం
–ఇకపై మూక హింసలకు మరణ దండన విధింపు
–నేర జాబితా నుంచి ఆత్మహత్యాయత్నం తొలగింపు
–చట్టాల మార్పుతో సత్వర న్యాయానికి సమయ నిర్దేశం
ప్రజా దీవెన/దిల్లీ: పాతకాల నాటి పోలీస్ చట్టాలకు పాతరేస్తూ కొత్త చట్టాలను పటిష్టంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. బ్రిటిష్ హయాం నుంచి అమలులో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), సాక్ష్యాధారాల చట్టం (ఎవిడెన్స్ యాక్ట్) స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన మూడు నేర శిక్షాస్మృతి బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది.
పాత చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సా క్ష్య అధినియం (బీఎస్) పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త బిల్లులకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. ఈ క్రమoలో రెండు, మూ డు రోజుల్లో ఏదో ఒక రోజున సదరు బిల్లులను రాజ్యసభలో ప్రవేశ పెట్టి అక్కడా ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సంతకoతో అవి చట్టాలుగా మారనున్నాయి.
పాత కొత్త బిల్లులు ఇలా....పాత చట్టంలో అత్యాచారానికి 375, 376 సెక్షన్లు ఉండగా కొత్త బిల్లులో దానిని సెక్షన్ 63గా పేర్కొన్నారు. ఇక పాత చట్టంలో హత్యకు 302 సెక్షన్ ఉండగా కొత్త బిల్లులో దానిని 101 సెక్షన్గా మార్పు చేశారు. అదేవిధంగా కిడ్నాప్నకు పాత చట్టంలో 359వ సెక్షన్ కాగా కొత్త బిల్లులో దానిని సెక్షన్ 136 కింద చేర్చారు.
న్యాయ సంహిత బిల్లు ఇలా… ఇందులో కొత్తగా 20 నేరాలను చేర్చుతూ ఐపీసీలోని 19 నిబంధనల తొలగించారు. ఇక
33 నేరాల్లో జైలు శిక్ష, 83 నేరాల్లో జరిమానా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 23 నేరాల్లో తప్పనిసరి కనీస శిక్ష, కొత్తగా 6 నేరాల్లో సమాజ సేవా శిక్ష విధించే విధంగా మార్పులు చేర్పులు జరిగాయి.
దస్త్రాలుగా ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డుల పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది.
చరాస్తికి విస్తృత నిర్వచన కల్పిస్తూ మహిళలు, పిల్లలపై నేరాలకు కొత్త అధ్యాయం మొదలు పెట్టారు. నేర ప్రయత్నం, ప్రేరణ, కుట్రకు ప్రత్యేక అధ్యాయoగా వర్గీకరించారు. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద చర్యలు, హిట్ అండ్ రన్, మూక దాడి, పిల్లలను నేరాలకు వినియోగించడం, మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపడం, గొలుసు దొంగతనం, విదేశాల్లో నేరాలను ప్రోత్సహించడం, భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, ఐక్యతను దెబ్బతీయడం, ఫేక్ వార్తలను ప్రచురించడం వంటి నేరాలకు నిర్వచనo కొత్త బిల్లుల్లో పొందుపర్చారు.
ఇక ఆత్మహత్యకు ప్రయత్నించడం నేర జాబితా నుంచి తొలగిస్తూ, భిక్షాటన మానవ అక్రమ రవాణా నేరంగా పరిగణిoచ డం, రూ.5వేల లోపు దొంగతనాలకు సమాజ సేవ శిక్ష విధించే విధంగా మార్పులు వచ్చాయి. పిచ్చివాడు, అవివేకి, ఇడియట్ వంటి పురాతన పదాలు తొమ్మిది చోట్ల తొలగించారు. బ్రిటీష్ క్యాలెండర్, క్వీన్, బ్రిటీష్ ఇండి యా, శాంతి కోసం న్యాయం వంటి పదాల తొలగిoచారు.
44 చోట్ల కోర్ట్ ఆఫ్ జస్టిస్ స్థానంలో కోర్టు అని, పిల్లలు అనే పదానికి బిల్లు మొత్తంలో ఏకీకృత నిర్వచనం చెప్పారు. 12 చోట్ల డీనోట్స్ స్థా నంలో మీన్స్ వాడుతూ దటీజ్ టూ సే స్థానంలో నేమ్లీ వాడు కోవా లని సూచిస్తున్నారు.
భారతీయ నాగరిక్ సురక్షా సంహిత లో భాగం గా మేజిస్ట్రేట్ విధించే జరిమానా పరిమితిని పెంచారు. నేరాంగీకార పరిధి మరింతగా విస్తరించి గతంలో 19 నేరాలుండగా ప్రస్తుతం 10ఏళ్లు అంతకంటే అధిక శిక్షల కేసులన్నింటికీ వర్తింప జేశారు కొత్త బిల్లులో అత్యాచారం కేసు చేర్చుతూ మూడేళ్ల లోపు శిక్షలు పడే కేసుల్లో అరెస్టుకు సీనియర్ పోలీసు అధికారుల ముంద స్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. మొదటి 40 నుంచి 60 రోజుల రిమాండులో 15 రోజుల పోలీసు కస్టడీకి అనుమతి తీసుకో వాలని, అయితే బెయిలు ఇవ్వడానికి ఇది అడ్డంకి కాదని పేర్కొన్నా రు.
జప్తు, స్వాధీనం వంటి చర్యలకు విధివిధానాలు వివరిస్తూ
తీర్పు వచ్చేవరకూ స్వయంగా హాజరుకాకపోయినా విచారణకు అవకాశం ఇవ్వాలని చెబుతున్నారు. ఇక దేశమంతా జీరో ఎఫ్ఐఆర్ అమలు లోకి తీసుకొచ్చారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, మూడు నుంచి ఏడేళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో ప్రాథమిక విచారణకు అనుమతి ఇచ్చారు.
దర్యాప్తులో ఫోరెన్సిక్ సాయానికి అనుమతి తీసుకోవాలని, తీవ్రమైన నేరాల్లో డీఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు అవసరమని, బెయిలుకు అర్థం సరళీకరణ అని పేర్కొన్నారు. మొదటి కేసు నిందితుల సత్వర బెయిలుకు అవకాశం కల్పించాలని, నిర్దోషిగా విడుదల చేయాలని కోరుతూ వేసే కేసుల్లో బెయిలు సరళీకరణ విధానాలు అమలు చేస్తామని, తొలిసారి నేరం చేసిన వారికి విధించే శిక్షల్లో మినహా యింపు ఇవ్వాలని, నాలుగో వంతుగానీ, ఆరోవంతుగానీ విధించాలని వివారించారు.
కేసుల్లో పారదర్శకత, జవాబుదారీతనం, వేగంగా న్యాయం కోసం ఆడియో, వీడియో రికార్డుల పరిగణనలోకి తీసుకున్నారు. సాక్షులు, నిందితుల వాంగ్మూలాల ఆడియో,వీడియో రికార్డులకు అవకాశం కల్పించాలని, ప్రజా ప్రతినిధులు, శాస్త్రీయ నిపుణులు, వైద్యాధికారి సాక్ష్యాలను రికార్డు చేయడానికి అవకాశం ఇవ్వాలని సూచించారు.
శోధన, సీజ్ చేయడాన్ని వీడియో తీసే అవకాశం ఇస్తూ క్షమా భిక్ష పిటిషన్ను విధివిధానాలు రూపొందించారు.
సాక్షుల రక్షణకు ప్రత్యేక పథకం అమలు చేస్తామని, బాధితుల రక్షణ సంబంధిత నిబంధనల చేర్చుతూ బాధితులకు విస్తృత నిర్వచనం ప్రకారo దర్యాప్తు వివరాలను బాధితులకు ఎప్పటికప్పుడు అందించ డం జరుగుతుందని పేర్కొన్నారు. రెండు కంటే ఎక్కువ వాయిదాలు అడగకుండా నిబంధనల రూపకల్పన చేయడంతో పాటు తప్పుడు కేసుల నుంచి ప్రభుత్వాధికారులకు, ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పిం చాలని, ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ మరింత సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఘోరమైన నేరాల్లో చేతులకు బేడీలు వేసే నిబంధన చేర్చారు. కోర్టులో హాజరుకావడానికి ఇచ్చే నోటీసు ప్రొఫార్మా తయారీ చేస్తూ ప్రభుత్వాధికారుల సాక్ష్యాలు ఆడియో, వీడియో రూపంలో సేకరించాలని, 35 నేరాల్లో ఆడియో, వీడియో రికార్డింగ్ చేర్చాలని, 35 నేరాల్లో సత్వర న్యాయానికి సమయ నిర్దేశం చేశారు.
భారతీయ సాక్ష్య అధినియం బిల్లులో…కొత్త బిల్లులో రెండు కొత్త సెక్షన్లు, 6 సబ్ సెక్షన్ల జోడించారు. 5 వివరణల జోడించి, 4 వివరణల తొలగించారు. 2 నిబంధనల జోడింపు. 24 నిబంధనల తొలగింపుతో మొత్తంగా 6 సెక్షన్ల తొలగించారు. దస్త్రాల్లో ఎలక్ట్రానిక్ రికార్డుల జోడించారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో సాక్ష్యం సేకరణకు అను మతిచ్చారు. ఎలక్ట్రానిక్ సాక్ష్యాల స్టోరేజీ, కస్టడీ, ప్రసారం వంటి అం శాల సమర్థ నిర్వహణ తో పాటు సెకండరీ సాక్ష్యం నోటిమాటగా, లి ఖితపూర్వకంగా సేకరణ కు అవకాశం కల్పించారు.
న్యాయపరంగా ఆమోదించేలా, విలువ ఉండేలా, ఎన్ఫోర్స్ చేసేలా ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డుల నిర్వహణ చేపట్టాలని సూచిoచారు.భార్యాభర్తల కేసుల్లో కాంపిటెంట్ సాక్ష్యం సేకరణ చేయాలoటూ వలసపాలక పదబంధాల తొలగింపుకు నిర్ణయం తీసుకుంది. భాష ఆధునికీకరణ. లింగ సున్నితత్వానికి గౌరవo ఇచ్చారు.
సమగ్ర మార్పులు: అమిత్ షా…నేర న్యాయ వ్యవస్థలో సమగ్ర మార్పులతో నేర బిల్లులను కొత్తగా తెచ్చామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చా మని, రాజద్రోహం వంటి పదాలను తొలగించామని, దేశానికి వ్యతి రేకంగా జరిగే దాడులను చేర్చామని వివరించారు. భారతీయ భావ నతో న్యాయ వ్యవస్థ ఉండేలా బిల్లులను తెచ్చామని, బానిసత్వ భావనల నుంచి విముక్తి కల్పించామని చెప్పారు.
బిల్లులకు ఆమోదం సందర్భంగా లోక్సభలో అమిత్ షా మాట్లాడారు. తొలిసారిగా బిల్లులకు మానవ హంగులు అద్దామని, గతంలో ఉన్న హర్ మెజెస్టీ, బ్రిటిష్ కింగ్డం, ద క్రౌన్, బారిష్టర్, రూలర్ వంటి పదాలు ఇక ఉండబోవని ఆయన తెలిపారు. ‘ఈ కొత్త చట్టాలు శిక్ష కంటే న్యాయంపైనే ఎక్కువ దృష్టి పెడతాయి. వలసవాద మనస్తత్వం, గుర్తుల నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తాయి. బాధితులకు న్యాయం చేసేవిగా ఉంటాయి’ అని పేర్కొన్నారు. సామూహిక (మూక) హింసాకాండకు పాల్పడితే మరణ దండన విధించే సెక్షన్ కొత్త బిల్లులో ఉందని అమిత్ షా తెలిపారు.