Actress Jayasudha :ప్రజా దీవెన, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్ తెలం గాణ ఫిల్మ్ అవార్డ్స్ కు అందిన నా మినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీ లించాలని జ్యూరీ సభ్యులకు ఎఫ్ డి సి ఛైర్మన్ దిల్ రాజు కోరారు. మంగళవారం ఎఫ్ డి సి సమావేశ మందిరంలో జ్యూరీ ఛైర్మన్ సినీనటి జయసుధ అధ్యక్షతన గద్దర్ అవా ర్డ్స్ జ్యూరీ సమావేశం జరిగింది. ప్ర భుత్వం అప్పగించిన బాధ్యతను ఛాలెంజ్ గా తీసుకుని ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఆ మె తెలిపారు. ఈ సందర్భంగా ఎఫ్ డి సి ఛైర్మన్ దిల్ రాజు మాట్లాడు తూ తెలుగు చలనచిత్ర రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే వి ధంగా వ్యవహరించాలని జ్యూరీ సభ్యులను కోరారు.
జ్యూరిలో నిష్ణాతులైన వారిని ప్రభు త్వం నియమించినట్లు తెలిపారు. 14 ఏండ్ల తర్వాత ప్రభుత్వం చల న చిత్ర అవార్డ్స్ ను ఇస్తున్నట్లు తె లిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలన చిత్ర అవార్డ్స్ కు ఇంత స్పం దన రాలేదని చెప్పారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మే నేజింగ్ డైరెక్టర్ డా. ఎస్. హరీష్ మాట్లాడుతూ సినీ నటి జయసుధ ఛైర్మన్ గా 15 మందితో గద్దర్ తె లంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరిని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలి పారు. గద్దర్ అవార్డ్స్ కు అన్ని కేట గిరీ లకు కలిపి 1,248 నామినేషన్లు అందినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ నెల 21 వ తేదీ నుండి నామి నేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ జరుగు తుందని చెప్పారు. ఈ గద్దర్ అ వార్డులకు గాను వివిధ క్యాటగిరిల ఎంట్రీ లకు గాను వచ్చిన నామినేష న్ల స్క్రీనింగ్ ప్రక్రియ గురించి సభ్యు లు చర్చించారు. ఈ పురస్కా రాల కు వ్యక్తిగత క్యాటగిరి లో 1172, ఫీచర్ ఫిలిం, బాలల చిత్రాలు, డెబిట్ చిత్రాలు, డాక్యుమెంటరీ/ లఘుచిత్రాలు, ఫిల్మ్ క్రిటిక్స్, పు స్తకాలు తదితర క్యాటగిరిలలో 76 దరఖాస్తులు వచ్చినట్టు జ్యురి తెలి పింది.