— ఆదనపు కలెక్టర్ శ్రీనివాస్
Collector Srinivas :ప్రజాదీవెన నల్గొండ : రబీ ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ కోరారు.రబీ ధాన్యం కొనుగోలు విషయమై బుధవారం తన ఛాంబర్లో నిర్వహించిన కొర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, అకాల వర్షాలు, గాలులు అన్నిటిని దృష్టిలో ఉంచుకొని జాప్యం చేయకుండా ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని, ఈ విషయంలో మిల్లర్లు, ధాన్యం కొనుగోలు నిర్వాహకులు అందరూ సహకరించాలని తెలిపారు.
రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేలా పౌరసరఫరాల ఎన్ ఫోర్సుమెంట్ విభాగం అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాలని అన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి హరీష్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, మార్కెటింగ్ శాఖ ఏడి ఛాయాదేవి, రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.