Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Amit as MP with the command of the head: అధిష్టానం ఆదేశంతో ఎంపిగా అమిత్

--నల్లగొండ, భువనగిరి స్థానాల్లో ఏదో ఒకదానిలో పోటీ ---మొత్తంగా 4జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ అధిక్యత చూపింది --మిగతా అన్ని ప్రాంతాల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి -- ఎమ్మెల్యేల పై వ్యతిరేకత ఉంది కాని పార్టీ ఒడుతుందనుకోలే --నల్లగొండలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్

అధిష్టానం ఆదేశంతో ఎంపిగా అమిత్

–నల్లగొండ, భువనగిరి స్థానాల్లో ఏదో ఒకదానిలో పోటీ
—మొత్తంగా 4జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ అధిక్యత చూపింది
–మిగతా అన్ని ప్రాంతాల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి
— ఎమ్మెల్యేల పై వ్యతిరేకత ఉంది కాని పార్టీ ఒడుతుందనుకోలే
–నల్లగొండలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్

ప్రజా దీవెన/నల్లగొండ: టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మా తనయుడు అమిత్ రెడ్డి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీలో ఉంటారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ అదేశానుసారం నల్లగొండ పార్లమెంట్ లేదంటే భువనగిరి పార్లమెంట్ స్థానాల నుంచి నా కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. తెలంగాణలో నాలుగు జిల్లాలో మాత్రమే కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఉందని, మిగిలిన జి ల్లాలలో మిశ్రమ ఫలితాలు వచ్చాయని వివరించారు.

హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో బిఆర్ఎస్ పార్టీ ఆధిపత్యం కనిపించిం దని గుర్తు చే స్తూ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత స్పష్టంగా కనిపించిం దని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతుందని కలలో కూడా ఊహించలే దని పెదవి విరిచారు. తెలంగాణ ముచ్చటగా మూడో ముఖ్యమంత్రి గా కేసీఆర్ మాత్రమే ఉండాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకున్నారు కానీ ఎమ్మెల్యేలు ఓడిపోవడం వల్ల ఫలితం తారుమారైందని అసహ నం వ్యక్తం చేశారు.

నల్లగొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై కొత్తగా వచ్చిన ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలని ఇటీ వల  జరిగిన సమీక్ష సమావేశంలో నా వంతుగా ప్రాజెక్టులపై సూచన లు, సలహాలు అందించానని వివారించారు. కొత్తగా ఎన్నికైన ప్రభు త్వం ప్రోటోకాల్ కు సంబంధించి విధివిధానాలు పకడ్బందీగా అమ లు చేయాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరు గ్యారంటి ల అమలు ఇప్పటికిప్పుడు సాధ్యపడేది కాదని జోష్యం చెప్పారు.రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో సృష్టించిన ఆస్తుల మీద స్వేదపత్రం విడుదల చేస్తుందని చెప్పారు. పార్లమెంటు పై పొగ బాంబు దాడి భద్రత లోపాలను స్పష్టంగా తేటతెల్లం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వాలు రాష్ట్ర భవిషత్తు గురించి, అభివృద్ధి కోసం పని చేయాలి కాని పట్టుదలకు పోయి చతికలప డొద్దని హితవు పలికారు.ఆరోపణలు లేని ప్రభుత్వాలు దేశంలో లేవని, అలాగే బిఆర్ఎస్ ప్రభుత్వం పై కూడా ఆరోపణలు చేస్తున్నారని, ఏ ప్రభుత్వం అయిన కూడా హుందాతనంగా వ్యవహరించాలని సూచించారు.