— నాగార్జునసాగర్ శా సనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి
Assembly Member Kundur Jaiveer Reddy : ప్రజా దీవెన, పెద్దవూర : భూ భార తి చట్టం నిజంగా రైతులకు చుట్ట మని నాగార్జునసాగర్ శా సనస భ్యులు కుందూరు జైవీర్ రెడ్డి అ న్నారు. తెలంగాణ భూభారతి చ ట్టం (భూముల హక్కుల రికార్డు -2025) పై నిర్వహిస్తున్న అవగా హన సదస్సులలో భాగంగా శనివా రం నల్గొండ జిల్లా పెద్దవూర మండ ల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవ గాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన వాగ్దానం మేరకు ధరణి స్థానంలో భూభారతి వంటి మంచి చట్టా న్ని తీసుకురావడం జరిగిందని, రై తు లందరూ భూభారతి చట్టాన్ని పెద్ద మనసుతో స్వీకరించాలని, ఈ చ ట్టం ద్వారా రైతులకు ఎంతో ప్ర యోజనం చేకూరుతుందని ధరణి లో ఉన్న సమస్యలన్నీటికి పరిష్కా రం భూ భారతి ద్వారా లభిస్తుం ద న్నారు. అధికారులు భూ భారతి చ ట్టంపై రైతులకు పెద్ద ఎత్తున అవ గాహన కల్పించాలన్నారు.
ధరణి వల్ల రైతుల ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వాటిని పరిష్కరించే నిమిత్తం రా ష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నాలుగు మండలాలలో పైలెట్ ప్రాజెక్టు కింద భూ భారతిని అమలు చేయడం జ రిగిందని, అందులో మొట్టమొదటి మండలం నాగార్జునసాగర్ నియో జకవర్గంలోని తిరుమలగిరి సాగర్ అని తెలిపారు. ఈ చట్టం ద్వారా భూ సమస్యలను పరిష్కరించేందు కు మంచి అవకాశం కలిగిందని, రై తులకు సంబంధించిన భూ సమ స్యలను పరిష్కరించడంలో తాము ఎప్పుడు ముందుంటామని తెలిపా రు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లా డుతూ భూ భారతి లో ప్రతి సం వ త్సరం రికార్డులను అప్డేట్ చేయ డం జరుగుతుందని, భూములకు హాద్దులను నిర్ణయించేందుకు సర్వే యర్ల ద్వారా జియో కో-ఆర్డినేట్ ఏ ర్పాటు చేసే వెసులుబాటు చట్టం లో ఉందని, భూ భారతిలో భూ ములకు సంబంధించిన అన్ని వివ రాలను ఆన్లైన్ రికార్డు చేయడం జ రుగుతుందని, ఈ ఆన్లైన్ రికార్డర్ శాశ్వతంగా పనికొస్తుంది తెలిపా రు. భూములను సర్వే చేసేందుకు గతంలో రైతులు, అధికారులు త హశీల్దార్లు చాలా ఇబ్బందులు పడే వారని,భూ భారతి ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే లైసెన్స్డ్ సర్వేయర్ ప ద్ధతిని తీసుకురానున్నదని తెలి పా రు.భూ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, అందుకే భూ భారతి చట్టాన్ని తీసు కువచ్చిందని, రైతులందరూ ఈ చ ట్టం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.
గతంలో మాదిరి భూముల సమ స్యల పరిష్కారానికి రైతులు కార్యా లయాల చుట్టూ తిరగాల్సిన అవ సరం లేదని, గతంలో ధరణిలో సాంకేతిక సమస్యలు, సర్వర్ డౌన్ సమస్యలు ఉండేవని, ఇప్పుడు అ లాంటి పరిస్థితి లేదన్నారు. ధరణి లో 4000 కు పైగా కోర్రి టేబుల్స్ ఉందేవని ,ఇప్పుడు భూ భారతిలో కేవలం 6 మాడ్యూల్స్ మాత్రమే ఏ ర్పాటు చేయడం జరిగిందని, ఇప్ప టివరకు 2020 అక్టోబర్ వరకు ఉ న్న సాదా బైనామాల పై ఆప్పీలు ప ద్ధతి ఉండేది కాదని, ఇప్పుడు భూ భారతిలో ఆర్డీవోకు అప్పీలు చేసు కోవచ్చని తెలిపారు.అంతేకాక చ ట్టంపై అన్ని విభాగాలు, నియమ, నిబంధనలను పూర్తిస్థాయిలో రైతు లకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారా యణబ్ అమిత్ మాట్లాడుతూ ధర ణి ద్వారా ప్రజలకు మేలు చేసే అవ కాశం అధికారులకు కూడా ఉండేది కాదని, అలాంటిది భూ భారతి వల్ల రైతులకు మేలు చేసేందుకు వెసుల పాటు ఉందని అన్నారు. చట్టం లో ని ముఖ్యమైన అంశాలను ఆయన రైతులకు వివరించారు. విభాగా లను వాటి వల్ల కలిగే ప్రయోజనా లను వివరించారు. మాజీ జడ్పి టిసి కృష్ణారెడ్డి, మాలియా మార్కె ట్ కమిటీ చైర్మన్ చంద్ర శేఖర్ రెడ్డి , లింగారెడ్డి తదితరులు భూ భారతి చట్టం పై మాట్లాడారు.పెద్ద ఊర త హసీల్దార్ శ్రీని వాస్ సదస్సుకు అ ధ్యక్షత వహిస్తూ చట్టంలోని ముఖ్య మైన అంశాలను వివరించారు.